Numaish: ఈ నెల 10 వరకు నుమాయిష్‌ ప్రవేశం నిలిపివేత

రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల వ్యాప్తి దృష్ట్యా నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే నుమాయిష్‌ ప్రవేశాన్ని ఈ నెల 10 వరకు నిలిపివేశారు.

Updated : 03 Jan 2022 06:35 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల వ్యాప్తి దృష్ట్యా నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన నుమాయిష్‌ ప్రవేశాన్ని ఈ నెల 10 వరకు నిలిపివేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 1న రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ కలిసి జ్యోతి వెలగించి ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాన్ని అనుసరించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ తెలిపింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని