Traffic jam: హైదరాబాద్‌- విజయవాడ హైవేపై వరద.. స్తంభించిన ట్రాఫిక్‌

శనివారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలోని చింతలచెరువు నిండిపోయింది.

Updated : 20 Sep 2022 16:15 IST

అబ్దుల్లాపూర్‌మెట్‌: శనివారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలోని చింతలచెరువు నిండిపోయింది. దీంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపైకి  వరద పోటెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా వరదనీరు చేరడంతో ఈ ఉదయం హైవేపై ట్రాఫిక్‌ స్తంభించింది. స్థానిక పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్నాయి. మరోవైపు బాటసింగారం నుంచి మజీద్‌పూర్‌ వెళ్లే దారిలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వాగుల వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి వాహన రాకపోకలను నిలిపేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని