ఆహారంతో వ్యాప్తి..ఆధారాల్లేవ్!
ఆహారం ద్వారా కరోనా వైరస్ వ్యాపించినట్లు ఆధారాలు లేవని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఏర్పాటు చేసిన కమిటీ అభిప్రాయపడింది.
దిల్లీ: ఆహారం ద్వారా కరోనా వైరస్ వ్యాపించినట్లు ఆధారాలు లేవని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఏర్పాటు చేసిన కమిటీ అభిప్రాయపడింది. వర్షాకాల సమావేశాల్లో భాగంగా దీనికి సంబంధించి లోక్సభకు నివేదిక అందజేసింది. వైరస్తో ప్రభావితమైన దేశాల నుంచి దిగుమతి చేసిన ఆహారపదార్థాలను స్వీకరించడం సురక్షితమేనని వెల్లడించింది. చైనా, ఇతర దేశాల్లో వైరస్ వ్యాపించిన తరుణంలో అక్కడినుంచి దిగుమతి చేసుకున్న ఆహారపదార్థాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవగా..ఆ అనుమానాలను నివృత్తి చేసే ఉద్దేశంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ నిపుణులతో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ మార్గదర్శకాలతో ఏకీభవించినట్లు కమిటీ నివేదికలో తెలిపింది. ‘కరోనా వైరస్తో ప్రభావితమైన దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆహారపదార్థాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని నిరూపించే ఆధారాలు లేవని కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది’ అని లోక్సభలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే వెల్లడించారు.
కాగా, లాక్డౌన్ సమయంలో ఆహార పదార్థాల దిగుమతి క్లియరెన్స్లు, ల్యాబ్ల్లో వాటిని పరీక్షించడం వంటి చర్యలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కరోనా కాలంలో ఆహారపదార్థాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రతలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు, ‘ఈట్ రైట్ డ్యూరింగ్ కొవిడ్-19’ అనే ఇ-హ్యాండ్ బుక్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు