శ్రీవారి హుండీకి రికార్డు స్థాయి ఆదాయం

శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. భక్తులు శుక్రవారం  సమర్పించిన కానుకలను లెక్కించగా...

Updated : 25 Dec 2020 23:34 IST

తిరుమల: శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. భక్తులు శుక్రవారం  సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.4.3కోట్లు ఆదాయం లభించింది. ఈ నెలలో ఇప్పటికే ఐదు పర్యాయాలు హుండీ ఆదాయం రూ.3కోట్లు దాటిన విషయం తెలిసిందే. అదే సమయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారిని రికార్డు స్థాయిలో 42వేల వరకు భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారిని గురువారం 31,475 మంది దర్శించుకున్నారు. స్వామివారికి 11,504 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.79 కోట్లు లభించింది. 

ఇవీ చదవండి

నవ వైకుంఠం.. యాదాద్రిక్షేత్రం..!

బోనస్‌ అని చెప్పి ఉద్యోగులకు షాక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని