Vande Bharat Express: గుడ్న్యూస్.. సికింద్రాబాద్- తిరుపతి ‘వందే భారత్’లో కోచ్లు రెట్టింపునకు ఓకే..
Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలులో కోచ్ల సంఖ్యను రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్లకు కృతజ్ఞతలు తెలపుతూ ఆయన ట్వీట్ చేశారు.
హైదరాబాద్: సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య సేవలందిస్తోన్న వందే భారత్ ఎక్స్ప్రెస్(Vande Bharat Express) రైలుకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎనిమిది కోచ్లతో నడుస్తోన్న ఈ సెమీ-హైస్పీడ్ రైలులో బోగీల సంఖ్యను పెంచాలన్న అభ్యర్థనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల భక్తులతో రైలులో రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రైలులో బోగీలను రెట్టింపు చేసేందుకు అంగీకరించింది. రైలులో ప్రస్తుతం ఉన్న 8 కోచ్లను 16కి పెంచేందుకు కేంద్రం అంగీకరించినట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(KishanReddy) వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలులో 120 నుంచి 130శాతం మేర ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. చాలా మంది ప్రయాణికులు రిజర్వేషన్లు దొరక్క ఈ రైలులో వెళ్లాలనుకున్నా ప్రయాణించలేకపోతున్నారు. ఈ విషయాన్ని ‘ఈనాడు’ ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వద్ద ప్రస్తావించగా.. ఆయన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ను పిలిచి తిరుపతి వందేభారత్ రైలులో బోగీల సంఖ్యను పెంచే విషయంపై ఆరా తీశారు. దీంతో ఈ రైలుకు ఉన్న డిమాండ్ను వివరిస్తూ ద.మ.రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కసరత్తు ప్రారంభించిన రైల్వే బోర్డు తాజాగా వందేభారత్ రైలులో కోచ్లను రెట్టింపు చేసేందుకు అంగీకరించడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..