Twitter New CEO salary: ట్విటర్ కొత్త సీఈవో పరాగ్ జీతం ఎంతో తెలుసా?
ట్విటర్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టిన భారతీయుడు, ముంబయికి చెందిన పరాగ్ అగర్వాల్కి ఓ పక్క అభినందనల వెల్లువెత్తుంటే.. మరో పక్క నెటిజన్లు ఆయన గురించి ఆసక్తికర విషయాలను గూగుల్ చేయడం మొదలుపెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టిన భారతీయుడు, ముంబయికి చెందిన పరాగ్ అగర్వాల్కి ఓ పక్క అభినందనలు వెల్లువెత్తుంటే.. మరో పక్క నెటిజన్లు ఆయన గురించి ఆసక్తికర విషయాలను గూగుల్ చేయడం మొదలుపెట్టారు. ఆయన వయసెంత, ఎక్కడెక్కడ చదువుకున్నారు, ట్విటర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించాక జీతం ఎంత వస్తుందనే విషయాలను తెగ వెతుకుతున్నారు. తాజాగా యూఎస్ ఎస్ఈసీకి ఆయన సీఈవోగా నియమితులైయ్యాక పరాగ్కి వచ్చే వార్షిక వేతన వివరాలను వెల్లడించింది.
38ఏళ్ల పరాగ్... 2005లో ఐఐటీ-బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ బీటెక్ పూర్తి చేశాక.. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్లో మాస్టర్స్, పీహెచ్డీ పట్టా పొందారు. ఆపై 2011లో ట్విటర్ సంస్థలో చేరారు. ఇక యూస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ వెల్లడించిన వివరాలు ప్రకారం... పరాగ్ వార్షిక వేతనం.. $ 1 మిలియన్ ( భారతదేశం కరెన్సీ ప్రకారం రూ. 7,50,81,000 / రూ. 7.50 కోట్లు) అన్నమాట. ఒక మిలియన్ డాలర్ల వార్షిక వేతనంతో పాటు 12.5 మిలియన్ డాలర్లు విలువ చేసే రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు కూడా అగర్వాల్ పొందనున్నారు. వీటితో పాటు ట్విటర్ ఉద్యోగులకు లభించే ఇతర అన్ని ప్రయోజనాలూ అగర్వాల్కు కూడా లభిస్తాయి.
(ట్విటర్ టీమ్తో కలిసి పరాగ్ బృంద చిత్రం)
పరాగ్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు
* పరాగ్ తండ్రి అణుమంత్రిత్వ శాఖలో సీనియర్అధికారిగా పనిచేశారు. అమ్మ రిటైర్డ్ స్కూల్ టీచర్.
* అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో ఆయన పాఠశాల విద్యాభ్యాసం జరిగింది.
* పరాగ్ అగర్వాల్, ప్రముఖ గాయని శ్రేయాఘోషల్ ఇద్దరూ కలిసి చదువుకున్నారు.
(గాయని శ్రేయా శ్రేయాఘోషల్తో...)
* 17ఏళ్ల వయసులో టర్కీలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్లో స్వర్ణ పతకం సాధించాడు.
* 2000లో ఐఐటీ ప్రవేశపరీక్షలో 77 ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం పరాగ్ను ట్విటర్లో ఫాలో అయ్యేవారి సంఖ్య సుమారు రెండు లక్షల యాభై వేలు. ఇక పరాగ్ 1339 మందిని ఫాలో అవుతున్నారు.
* పరాగ్ భార్య పేరు వినీతా అగర్వాల్. వైద్యరంగానికి సంబంధించిన ‘ఆండ్రీసెన్ హోరోవిట్జ్ఝ’ అనే కంపెనీలో భాగస్వామిగా ఉన్నారు. వీరికి మూడేళ్ల వయస్సున్న బాబు ఉన్నాడు. పేరు అన్ష్.
(భార్య వినీతతో..)
* బాబు పేరు ‘అన్ష్’ అని పేరు పెట్టడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉందని ట్విటర్ చెప్పాడు పరాగ్. అమెరికాలో థాంక్స్ గివింగ్ రోజున అన్ష్ పుట్టాడట అందుకే. ప్రతి దానిలో (కుటుంబం, కమ్యూనిటీ) భాగస్వామ్యం ఉండే అర్థం వచ్చేలా ఈ పేరు పెట్టారట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
నోటా విజేతగా నిలిస్తే?
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?