Corona: బలిపీఠంపై గురువు!
నవసమాజ నిర్మాతపై కొవిడ్ పిడుగు పడింది. బాలలను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్ది బంగారు భవిష్యత్తుకు బాటలు పరిచే ఉపాధ్యాయులను కొవిడ్ కమ్మేసింది. కర్ణాటకలో జరిగిన విషాదకర ఘటనే ఇందుకు సాక్షాత్కారంగా నిలుస్తోంది...
ఎన్నికల విధుల్లో పాల్గొన్న 1,673 మంది మృతి
ఇంటర్నెట్ డెస్క్: నవసమాజ నిర్మాతపై కొవిడ్ పిడుగు పడింది. బాలలను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్ది బంగారు భవిష్యత్తుకు బాటలు పరిచే ఉపాధ్యాయులను కొవిడ్ కమ్మేసింది. కర్ణాటకలో జరిగిన విషాదకర ఘటనే ఇందుకు సాక్షాత్కారంగా నిలుస్తోంది. కర్ణాటకలో ఎన్నికల విధులు నిర్వర్తించిన 52 మంది ఉపాధ్యాయులు వైరస్ బారిన పడి మరణించారు. అటు యూపీలో 1,621 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. వీరంతా ఎన్నికల సందర్భంగానే కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.
కర్ణాటకలోని బసవకళ్యాణ్ నియోజకవర్గానికి, బీదర్ మున్సిపాలిటీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 1 నుంచి మే 14 మధ్య ఈ ఎన్నికలు నిర్వహించారు. ఇందుకోసం 1,434 మంది బోధన, బోధనేతర సిబ్బందిని విధి నిర్వహణ కోసం ఎంపిక చేశారు అధికారులు. ఈ నిర్ణయమే వారి పాలిట శాపంగా మారింది. ఎన్నికల క్రతువులో పాల్గొన్న ఉపాధ్యాయులు, సిబ్బందిలో 52 మంది మరణించడం తీవ్ర కలకలం రేపింది. ఎంపిక చేసిన సిబ్బందికి ముందుగానే కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్గా తేలిన 67 మందిని విధులకు దూరంగా ఉంచారు. ఈ నేపథ్యంలో మరణించిన ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలోనే కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మరో 26 మంది ఉపాధ్యాయులు కరోనాతో పోరాడుతున్నారు. వివిధ ఆస్పత్రుల్లో వారికి చికిత్స అందిస్తున్నారు.
ఈ విషయంపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయి. సమాజ నిర్మాతలుగా చెప్పుకునే ఉపాధ్యాయుల గురించి పట్టించుకునే నాథుడే కరవయ్యాడని వాపోయాయి. ఏ రాజకీయ పార్టీ కూడా వీటి గురించి మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ ఘటనపై స్పందించిన బీదర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ టీఆర్ దొడ్డే.. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూనే ఎన్నికలను నిర్వహించామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు వైరస్ ఎలా సోకిందో తేలాల్సి ఉందని చెప్పారు.
యూపీలో 1,621 మంది బలి!
మరోవైపు ఉత్తర్ప్రదేశ్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే యూపీలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇందులో పాల్గొన్న ఉపాధ్యాయుల్లో చాలా మంది కరోనాతో మరణించారని ఉత్తర్ప్రదేశ్ ప్రాథమిక శిక్షక్ సంఘ్ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.ఏప్రిల్ తొలి వారం నుంచి మే 16 వరకు ఉత్తర్ప్రదేశ్లో ఏకంగా 1,621 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని సంఘ్ వెల్లడించింది. ఇందులో 90శాతానికి పైగా మరణాలు పంచాయతీ ఎన్నికలకు హాజరైన సిబ్బందివేనని కుండబద్దలు కొట్టింది. అయితే, యోగి సర్కారు మాత్రం ఈ నివేదికలను పూర్తిగా తప్పుపట్టింది. ముగ్గురంటే ముగ్గురు ఉపాధ్యాయులే కరోనాతో మరణించారని చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం