నగల దుకాణంలో 31 మందికి కరోనా పాజిటివ్‌

ఓ ఆభరణాల దుకాణంలో పనిచేసే 31 మంది సిబ్బందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Published : 20 Nov 2020 01:44 IST

ఇండోర్‌: ఓ ఆభరణాల దుకాణంలో పనిచేసే 31 మంది సిబ్బందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ పట్టణంలో చోటుచేసుకున్న ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు అధికారులు వివరించారు. అంతేకాకుండా గత వారం రోజులుగా ఈ దుకాణానికి వచ్చిన ఇతర సిబ్బంది, వినియోగదారులను గుర్తించే పని మొదలు పెట్టినట్టు వారు తెలిపారు. ఇక్కడికి వచ్చిన వారిలో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలు ఉంటే వెంటనే తమకు తెలియజేయాల్సిందిగా సూచించారు. ఆభరణాల దుకాణాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మాత్రమే షాపు తెరిచేందుకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీపావళి, ధంతేరాస్‌ సందర్బంగా దుకాణాలు వారం రోజులుగా వినియోగదారులతో నిండిపోయాయి. ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్-19 నియమాలకు విరుద్ధంగా వివిధ నగరాలు, పట్టణాల్లో ప్రజలు మాస్కులు ధరించకుండానే చక్కర్లు కొట్టడం కనిపించింది. ఈ నేపథ్యంలో ఒకే దుకాణంలో ఇంత మంది సిబ్బందికి కొవిడ్‌ సోకిన ఘటన చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని