అమెరికాలో టీకా పంపిణీ మొదలు.. కానీ
అమెరికాలో కోట్లాది కరోనా వైరస్ డోసుల పంపిణీ ప్రారంభం కానుందనే వార్తలు వెలువడుతున్నాయి.
రికార్డు స్థాయిలో నమోదవుతున్న కొవిడ్ కేసులు..
వాషింగ్టన్: అగ్రరాజ్యంలో కరోనా వైరస్ కేసులు మరోసారి రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం మధ్యాహ్నానికి మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 16 మిలియన్లకుపైగా చేరుకుంది. ఇక ఇక్కడ కొవిడ్ మరణాలు మూడు లక్షల మార్కును దాటేశాయి. ఇదిలా ఉండగా ఆదివారం నుంచి ఆ దేశవ్యాప్తంగా కోట్లాది కరోనా వైరస్ డోసుల పంపిణీ ప్రారంభం కానుందనే వార్తలు వెలువడుతున్నాయి. అమెరికాలో తొలిసారిగా ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీకి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. అత్యవసర వినియోగానికి ఫైజర్ వ్యాక్సిన్ను వాడేందుకు ఎఫ్డీఏ అనుమతి ఇచ్చినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అంతేకాకుండా 24 గంటల్లోగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో కరోనా అంతానికి, కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ఈ చర్య కీలకం కానుందని నిపుణులు అంటున్నారు.
పంపిణీ ఇలా..
వ్యాక్సిన్ తొలి విడత పంపిణీలో భాగంగా దేశంలోని 145 ప్రాంతాలకు ఆదివారం చేరవేస్తామని.. ఇక టీకా వేసే ప్రక్రియ సోమవారం ప్రారంభమవుతుందని అమెరికా ఆర్మీ జనరల్ గుస్తావే పెర్నా ప్రకటించారు. అనంతరం వివిధ రాష్ట్రాల్లోని మరో 636 ప్రాంతాల్లో టీకా పంపిణీ మంగళ, బుధవారాల్లో జరుగుతుందని ఆయన వివరించారు. తొలివిడత వ్యాక్సిన్లు వైద్యారోగ్య సిబ్బందికి అందజేస్తారని తెలుస్తోంది. పంపిణీ సక్రమంగా, నిరంతరాయంగా సాగేందుకు ఫైజర్ వ్యాక్సిన్ డోసులను ప్రతి వారం భారీ సంఖ్యలో సిద్ధం చేస్తామని ఆర్మీ జనరల్ వెల్లడించారు.
కరోనా ప్రభావంతో ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతిన్న దేశాల్లో అమెరికా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. గత కొన్ని రోజులుగా సగటున రోజుకు రెండు లక్షలకు పైగా కరోనా బాధితుల సంఖ్య నమోదవుతోంది. కేసుల సంఖ్య మళ్లీ పుంజుకోవటంతో ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఇక ఈ వారం సరాసరి మరణాల సంఖ్య అత్యధికంగా రోజుకు 2411 కావటం అక్కడి ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో.. అగ్రరాజ్యంలో ఫైజర్ టీకాకు అనుమతి లభించటం కీలక మలుపు అని పలువురు భావిస్తున్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం