రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధమే
రైతులు స్వేచ్ఛాయుత వ్యాపార అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వ ప్రతిపాదనలు తిరస్కరించిన
కేంద్రం ప్రతిపాదనలను అన్నదాతలు పరిశీలించాలి
వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్
దిల్లీ: రైతులు స్వేచ్ఛాయుత వ్యాపార అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వ ప్రతిపాదనలు తిరస్కరించిన అన్నదాతలు.. కేంద్రం దిగిరాకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తోమర్ నేడు కీలక ప్రసంగం చేశారు. రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్న కేంద్రమంత్రి తెలిపారు.
‘గత సెషన్లో ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాయి. చర్చల తర్వాతే లోక్సభ, రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాయి. మండీల నుంచి విముక్తి కల్పించి రైతులకు స్వేచ్ఛాయుత వ్యాపార అవకాశాలు కల్పించేందుకే కొత్త చట్టాలను తీసుకొచ్చాం. ఇప్పుడు రైతులు తమ పంటలను ఎక్కడైనా, ఎవరికైనా, ఎంత ధరకైనా విక్రయించుకోవచ్చు’ అని తోమర్ చెప్పారు.
రైతుల భూమికి పూర్తి రక్ష..
చట్టాలతో రైతుల భూములకు సంపూర్ణ భద్రత ఉంటుందని వ్యవసాయ మంత్రి అన్నారు. ‘రైతుల భూములను పారిశ్రామికవేత్తలు ఆక్రమిస్తారనే వదంతలు వినిపిస్తున్నాయి. ఒప్పంద వ్యవసాయం కొత్తదేమీ కాదు. గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్, కర్ణాటకలో గత కొన్నేళ్లుగా ఇది కొనసాగుతోంది. అక్కడ ఎలాంటి సమస్యలు రాలేదు. రైతుల భూముల లీజు, ఒప్పందాలపై కొత్త చట్టాల్లో ఎలాంటి నిబంధనలు లేవు’ అని తోమర్ తెలిపారు. కొత్త చట్టాలను యావత్ దేశం స్వాగతించినప్పటికీ కొందరు రైతులు, కొన్ని రైతు సంఘాలు ఉద్యమ బాట పట్టాయని చెప్పారు. ఓ వైపు పంజాబ్ రైతులతో చర్చలు జరుగుతుండగానే ఆందోళనకు దిగారన్నారు.
రద్దుకే పట్టుబడితే ఎలా..
‘అన్నదాతలతో చర్చలు జరపడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. కొత్త చట్టాల్లో సమస్య ఎక్కడుందో చెబితే వాటిని పరిష్కరిస్తాం. అన్నదాతల సందేహాలు తీరుస్తాం. ఇందులో మాకు ఎలాంటి అహం లేదు. ఇప్పటికే పలుమార్లు రైతులతో చర్చలు జరిపాం. రైతులు తమ సలహాలు ఇవ్వాలని, వాటిని పరిశీలిస్తామన్నాం. కానీ డిసెంబరు 8 తర్వాత వారి నుంచి ఎలాంటి సూచనలు రాలేదు. అప్పటికీ కేంద్రం ప్రతిపాదనలు పంపింది. వాటిని రైతులు తిరస్కరించారు. చట్టాల రద్దుకు రైతులు పట్టుబట్టారు. సమస్యలపై ఎలాంటి దాపరికాలు లేకుండా చర్చించేందుకు మేం సిద్ధమే’ అని తోమర్ చెప్పుకొచ్చారు.
ప్రతిపాదనలు పరిశీలించండి..
ఏపీఎంసీలు, కనీస మద్దతు ధరపై కొత్త చట్టాల ప్రభావం ఏమీ ఉండదని, ఈ విషయాన్ని రైతులకు వివరించే ప్రయత్నం చేస్తున్నామని కేంద్రమంత్రి తోమర్ తెలిపారు. కనీస మద్దతు ధరపై రాతపూర్వక హామీ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను రైతులు మరోసారి పరిశీలించాలని కోరారు. అన్నదాతలు ఎప్పుడు కోరితే అప్పుడు వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని వ్యవసాయ మంత్రి భరోసా ఇచ్చారు. ఓవైపు కొవిడ్ పరిస్థితులు, మరోవైపు విపరీతమైన చలిలో అన్నదాతలు నిరసనలు చేయడం ఆందోళన కలిగిస్తోందని తోమర్ అన్నారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగాన్ని ముందుగా అనుకున్న సమయానికంటే 4 సెకన్లు ఆలస్యంగా చేపట్టినట్లు ఇస్రో తాజా నివేదికలో వెల్లడించింది. -
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
పెళ్లి పత్రికలో ప్రధాని మోదీ పేరును ప్రస్తావించడం ఓ నవ వరుడిని చిక్కుల్లో పడేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!