మరో ముఖ్యమంత్రికి కరోనా!

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌కు కరోనా వైరస్‌ వ్యాధి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Published : 02 Sep 2020 21:42 IST

పనాజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోమ్‌ ఐసోలేషన్‌లో కొనసాగుతున్నారు. ‘‘నాకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే నాకు ఏ విధమైన లక్షణాలు లేనందున.. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాను. నా బాధ్యతలను నేను ఇంటి నుంచే నిర్వర్తిస్తాను. ఇటీవల నన్ను కలిసిన వ్యక్తులు అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అని 47 ఏళ్ల సావంత్‌ ఈ ఉదయం సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని