మిగ్-29కే ప్రమాదం: పైలట్ మృతదేహం లభ్యం
భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కే శిక్షణ విమానం అరేబియా సముద్రంలో కూలిపోయిన ఘటనలో గల్లంతైన పైలట్ మృతదేహం లభ్యమైంది.
(ప్రతీకాత్మక చిత్రం)
దిల్లీ: భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కే శిక్షణ విమానం అరేబియా సముద్రంలో కూలిపోయిన ఘటనలో గల్లంతైన పైలట్ మృతదేహం లభ్యమైంది. రెండువారాల క్రితం జరిగిన ఆ దుర్ఘటన నుంచి ఒక పైలట్ ప్రాణాలతో బయటపడగా మరో పైలట్ నిషాంత్ సింగ్ గల్లంతైన విషయం తెలిసిందే. తాజాగా పైలట్ నిషాంత్ మృతదేహాన్ని గోవాకు 30మైళ్ల దూరంలో నావికా దళాలు కనుగొన్నాయి. ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ముమ్మర గాలింపు చేపట్టిన నౌకాదళాలకు, సముద్రంలో 70మీటర్ల లోతులో నిషాంత్ మృతదేహం కనిపించినట్లు సమాచారం. ఘటన జరిగిన మూడు రోజుల అనంతరం(నవంబర్ 29న) మిగ్-29కి చెందిన కొన్ని శిథిలాలు లభ్యమయినప్పటికీ నిషాంత్ ఆచూకీ తెలియలేదు. అయినప్పటికీ ఆయన సురక్షితంగానే ఉంటారనే ఆశతో అందరూ ఎదురుచూశారు. కానీ, చివరకు అది విషాదాన్నే మిగిల్చింది. నిషాంత్ మృతదేహం లభ్యమైన విషయాన్ని పైలట్ కుటుంబ సభ్యులకు తెలియజేసిన అధికారులు, నిర్ధారించుకునేందుకు డీఎన్ఏ పరీక్ష జరిపేందుకు ఏర్పాట్లు చేశారు.
భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కే శిక్షణ విమానం నవంబర్ చివరి వారంలో సముద్రంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. శిక్షణలో భాగంగా అరేబియా సముద్రంపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయింది. ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు ఉండగా.. ఒక పైలట్ను కాపాడగలిగారు. గల్లంతైన మరో పైలట్ నిషాంత్ సింగ్ కోసం దాదాపు తొమ్మిది యుద్ధనౌకలు, 14 విమానాలతో పాటు ప్రత్యేక సాంకేతికను వినియోగించిన అధికారులు, గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దించి తీవ్రగాలింపు చేపట్టింది. చివరకు రెండువారాల అనంతరం పైలట్ మృతదేహం లభ్యమైంది.
ఇదిలాఉంటే, ఏడాది కాలంలో మిగ్-29కే విమానం ప్రమాదానికి గురవడం ఇది మూడోసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో గోవాలో పక్షులు ఢీకొట్టడంతో మిగ్-29కే విమానం కూలిపోయింది. ఆ ఘటనలో మాత్రం ఇద్దరు పైలట్లు సురక్షితంగానే బయటపడ్డారు. గతేడాది నవంబరులో సాంకేతికలోపం కారణంగా మిగ్ కూలిపోయింది. భారత నౌకాదళానికి 40కి పైగా మిగ్-29కే యుద్ధ విమానాలున్నాయి. గోవా నేవీ బేస్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి వీటిని నిర్వహిస్తుంటారు.
ఇవీ చదవండి..
ఫైటర్ పైలట్ విలువ తెలుసా..?
చైనా తిమింగలాల వేట ఇలా..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలపై అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం