వచ్చే ఏడాదికి భారత్లో వ్యాక్సిన్, కానీ..
కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చే ఏడాదికి భారత్లో అందుబాటులోకి వస్తుందని ప్రముఖ వైద్య నిపుణులు గగన్దీప్ కాంగ్ అన్నారు.
వాటి విజయావకాశం 50 శాతమే!
దిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చే ఏడాదికి భారత్లో అందుబాటులోకి వస్తుందని ప్రముఖ వైద్య నిపుణులు గగన్దీప్ కాంగ్ అన్నారు. కాకపోతే 130 కోట్ల మంది భారతీయులకు దాన్ని అందజేయడం అతి పెద్ద సవాలని ఆమె అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ భద్రతకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ అడ్వైజరీ కమిటీలో సభ్యురాలు, వెల్లూరుకు చెందిన క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ అయిన గగన్దీప్ ఓ మీడియా సంస్థతో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా ప్రయోగదశల్లో ఉన్న వ్యాక్సిన్ల సమర్థత ఈ ఏడాది చివరికల్లా తేలిపోతుంది. మంచి ఫలితాలు సాధిస్తే..2021 ప్రారంభానికి కొద్ది సంఖ్యలో వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయి. పెద్ద సంఖ్యలో కావాలంటే చివరి వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మూడో దశ ప్రయోగ స్థాయిలో ఉన్న వ్యాక్సిన్లు విజయవంతం అయ్యే అవకాశం 50 శాతం మాత్రమే’ అని వాస్తవ పరిస్థితులను వివరించారు.
ప్రయోగాలు ముగించుకొని వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరవాత దాని నిల్వ, పంపిణీ భారత దేశంలో అతి పెద్ద అడ్డంకిగా ఉందని ఆమె వెల్లడించారు. ‘కరోనా కారణంగా ప్రమాదం ఎక్కువగా పొంచి ఉన్న వృద్ధులకు వ్యాక్సిన్ అందించేందుకు సరైన వ్యవస్థ లేదు. అన్ని వయస్కుల వారికి రోగనిరోధక శక్తిని ఇచ్చేలా ఒక వ్యవస్థను నిర్మించడం ఇప్పుడు భారత్ ముందున్న పెద్ద సవాలు’ అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా..భారత్ పూర్తి స్థాయిలో సరైన ఫలితాలు ఇవ్వని రాపిడ్ యాంటిజెన్ పరీక్షలపైనే ఎక్కువగా ఆధారపడుతోందని వెల్లడించారు. రోజూవారీగా నిర్వహించేది యాంటిజెన్ లేక ఆర్టీపీసీఆర్ పరీక్షలా అనే విషయాన్ని డేటాలో ప్రస్తావించట్లేదని, అలాగే లక్షణాలు కనిపించిన వ్యక్తులు లేక లేని వారిపై నిర్వహిస్తున్నారా అనే విషయాన్ని కూడా స్పష్టం చేయట్లేదన్నారు. దేశంలో యాంటిజెన్ పరీక్షల సంఖ్యను పెంచినప్పటికీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను నియంత్రించడానికి విధించిన ఐదు శాతం బెంచ్మార్క్ కంటే భారత్లో వైరస్ పాజిటివిటీ ఎనిమిది శాతంగా ఉండటం ఆందోళనకర పరిణామమన్నారు. వివిధ రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించే విధానమేంటో తెలియకపోతే వైరస్ వేగవంతం అవుతుందో లేదో చెప్పడం కష్టమని ఆమె వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం