యువతకూ ముప్పే..! WHO హెచ్చరిక
ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారితో యువతకూ ముప్పు పొంచివుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరించింది.
వైరస్కు యువత అతీతం కాదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచన
జెనీవా: ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారితో యువతకూ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరించింది. యువకులు ఈ వైరస్కు అతీతం కాదని పునరుద్ఘాటించింది. ఈ విషయాన్ని ఇదేవరకే స్పష్టం చేశామని, అయినప్పటికీ మరోసారి హెచ్చరిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధోనామ్ గెబ్రెయేసస్ స్పష్టం చేశారు. ఈ వైరస్తో వృద్ధులకు తీవ్ర ముప్పు ఉన్నట్లుగానే యువతకూ ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.
‘యువకులకు వైరస్ సోకే ప్రమాదం ఉంది, కరోనా బారినపడిన యువకులు కూడా మరణించే అవకాశాలు ఉన్నాయి. వీరి నుంచి వైరస్ మరొకరికి సోకే ప్రమాదం ఉంది’ అని అధోనామ్ అన్నారు. అందుకే మిగతావారిలాగే యువకులు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తద్వారా వారిని వారు రక్షించుకోవడంతోపాటు ఇతరులను కూడా రక్షించడం వీలవుతుందన్నారు. కొన్నిదేశాల్లో ఆంక్షల సడలింపులతో యువత విహారయాత్రలకు సిద్ధమౌతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీచేశారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో యువతదే కీలకపాత్ర అని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ మరోసారి నొక్కిచెప్పారు. పలుదేశాల్లో రెండో దఫా వైరస్ విజృంభిస్తోన్న తీరును టెడ్రోస్ గుర్తుచేశారు. అలసత్యం వహిస్తే రాబోయే రోజుల్లో మరింత ప్రమాదం పొంచి ఉందని తేల్చిచెప్పారు. మహమ్మరిని ఎదుర్కొవడంలో ముందుండి ఎన్నో ప్రాణాలను రక్షిస్తోన్న యోధులకు, ఆరోగ్య సిబ్బందికి సెల్యూట్ అంటూ వారి సేవలను టెడ్రోస్ కొనియాడారు.
చాలా సందర్భాల్లో ఈ వ్యాధి సోకినవారిలో స్పల్ప లక్షణాలే కనిపించవచ్చు. కానీ ఇది శరీరంలోని మరిన్ని అవయవాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగాధిపతి మైక్ రేయాన్ స్పష్టం చేశారు. దీర్ఘకాలంలో వీటి పర్యవసానాలపై ప్రస్తుతానికి స్పష్టత లేదని అభిప్రాయపడ్డారు. అందుకే ప్రమాదం బారినపడకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని సూచించారు. విజ్ఞతతో ఆలోచించి జాగ్రత్త పడాలని మైక్ రేయాన్ యువతకు మరోసారి విజ్ఞప్తి చేశారు.
‘ప్రస్తుతం యువకుల్లో చాలా మందిలో తక్కువ లక్షణాలే కనిపిస్తున్నాయి. కానీ, అది ఎప్పుడూ ఒకేలా ఉండదు. వారిలో కూడా వ్యాధి తీవ్రతరం కావచ్చు. ఐసీయూల్లో చికిత్స తీసుకునే అవసరం రావచ్చు. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ఆస్కారం కూడా ఉంది’ ఉని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగ నిపుణురాలు మారియా వాన్ కెర్కోవ్ హెచ్చరించారు.
ఇవీ చదవండి..
భారత్లో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదు..!
సరైన వెంటిలేషన్ లేకుంటే వైరస్తో ఉక్కిరిబిక్కిరే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
నోటా విజేతగా నిలిస్తే?
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?