చొరబాటుకు సిద్ధంగా 135 మంది ముష్కరులు.. దేశంలో భారీఉగ్ర కుట్ర!
గణతంత్ర వేడుకల నేపథ్యంలో దేశంలోకి చొరబడేందుకు దాదాపు 135 మంది ముష్కరులు నియంత్రణ రేఖ వద్ద (ఎల్ఓసీ) ఎదురుచూస్తున్నారని......
దిల్లీ: గణతంత్ర వేడుకల నేపథ్యంలో దేశంలోకి చొరబడేందుకు దాదాపు 135 మంది ముష్కరులు నియంత్రణ రేఖ వద్ద (ఎల్ఓసీ) ఎదురుచూస్తున్నారని కశ్మీర్ బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) రాజాబాబు సింగ్ వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం నాడు ముష్కరులు దాడులకు తెగబడే అవకాశాలున్నట్లు వచ్చిన హెచ్చరికల మేరకు సరిహద్దుల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. నిఘా వర్గాల హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని జమ్ముకశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతా దళాలు డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. అయితే ప్రస్తుతం సరిహద్దు వద్ద పరిస్థితులు శాంతియుతంగానే ఉన్నట్లు తెలిపారు.
‘దేశంలోకి చొరబడేందుకు ఎల్ఓసీ వెంబడి పలు ప్రాంతాల్లో 104 నుంచి 135 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నట్లు నిఘావర్గాల నుంచి సమచారం అందింది. చొరబాట్లకు వీలు లేకుండా అన్ని ప్రాంతాల్లో నిఘా ఉంచాం. ప్రస్తుతం పరిస్థితులు శాంతియుతంగానే ఉన్నాయి’ అని బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడించారు. గతంతో పోలిస్తే 2021లో చొరబాటులు తగ్గాయని ఆయన తెలిపారు. గతేడాది 58 మంది దేశంలోకి చొరబడేందుకు యత్నించారని, అందులో ఐదుగురిని కాల్చేసినట్లు పేర్కొన్నారు. 21 మంది తిరిగి వెనక్కి వెళ్లిపోగా.. ఒకరు లొంగిపోయినట్లు తెలిపారు. మొత్తం 31 మంది చొరబడినట్లు వెల్లడించారు. 2020లో 36 మంది, 2019లో 130 మంది ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించినట్లు రాజాబాబు సింగ్ స్పష్టం చేశారు.
తాలిబన్లు చొరబడే ప్రమాదమున్నట్లు వచ్చిన వార్తలను ఐజీ ఈ సందర్భంగా కొట్టిపారేశారు. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి సమాచారం లేదన్నారు. అయినప్పటికీ గట్టి నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. డ్రోన్ ముప్పు పొంచి ఉన్నట్లు తెలిపారు. ‘గతేడాది కూడా డ్రోన్లను గుర్తించాం. కానీ ఎవరూ మన భూభాగంలోకి ప్రవేశించలేదు. ఈ ఏడాది తగిన చర్యలు తీసుకుంటున్నాం. యాంటీ డ్రోన్ విధానాలతో ఆ చర్యలను సమర్థంగా ఎదుర్కొంటాం’ అని బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.