Air India: కాక్పిట్లోకి స్నేహితురాలు.. పైలట్ సస్పెన్షన్.. రూ.30 లక్షల జరిమానా!
ఎయిర్ ఇండియా విమాన పైలట్ తన స్నేహితురాలిని కాక్పిట్లోకి ఆహ్వానించిన ఘటనపై డీజీసీఏ చర్యలు తీసుకుంది. పైలట్పై మూడు నెలల సస్పెన్షన్ వేటుతోపాటు సంస్థకు రూ.30 లక్షల జరిమానా విధించింది.
దిల్లీ: విమానంలో ఓ పైలట్ తన స్నేహితురాలిని కాక్పిట్ (Cockpit) లోకి ఆహ్వానించిన ఘటనలో.. ఎయిర్ ఇండియా (Air India)పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) కొరడా ఝుళిపించింది. నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ.. ఈ వ్యవహారంలో పైలట్పై మూడు నెలల సస్పెన్షన్ వేటు వేయడంపాటు సంస్థకు రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ అంశాన్ని నివేదించడంలో జాప్యం జరిగిందంటూ ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంబెల్ విల్సన్తో పాటు ఎయిర్ ఇండియా భద్రత, రక్షణ- నాణ్యత విభాగాధిపతికి సైతం ఇటీవల డీజీసీఏ.. షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు.. ఈ ఘటనపై విచారణ ముగిసేంత వరకు ఆ విమానంలో ఉన్న సిబ్బందిని విధుల నుంచి తప్పించాలని ఎయిర్ ఇండియా సంస్థకు సూచించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మేరకు చర్యలు తీసుకుంది.
ఫిబ్రవరి 27న దుబాయ్- దిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో.. ఓ పైలట్ తన స్నేహితురాలిని కాక్పిట్లోకి తీసుకెళ్లడమే గాక, ప్రయాణ సమయమంతా ఆమెను అక్కడే కూర్చోబెట్టుకున్నాడు. ప్రయాణికుల్లో తన స్నేహితురాలు ఉందని గుర్తించిన పైలట్.. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఆమెను కాక్పిట్లోకి ఆహ్వానించాడు. దిల్లీ చేరుకునేంతవరకు అంటే.. దాదాపు 3 గంటలపాటు ఆ మహిళ కాక్పిట్లోనే ఫస్ట్ అబ్జర్వర్ సీట్లో కూర్చున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై క్యాబిన్ సభ్యుల్లో ఒకరు డీజీసీఏకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. తన స్నేహితురాలికి కాక్పిట్లోనే భోజనం అందజేయాలని, సకల మర్యాదలు చేయాలని విమాన సిబ్బందిని పైలట్ ఆదేశించినట్లు సమాచారం. ఇందుకు అభ్యంతరం తెలిపిన సిబ్బందితో పైలట్ దురుసుగా ప్రవర్తించినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Education ministry: 10వ తరగతిలో.. 27.5లక్షల మంది ఫెయిల్..!
-
Crime News
Visakhapatnam: పెందుర్తిలో అర్ధరాత్రి రెచ్చిపోయిన రౌడీ మూకలు
-
Politics News
Andhra News: ఎంపీ అవినాష్ రెడ్డి కేసు అంతులేని కథ: గోరంట్ల
-
Sports News
CSK vs GT: ‘ఫైనల్’ ఓవర్లో హార్దిక్ అలా ఎందుకు చేశాడో..?: సునీల్ గావస్కర్
-
World News
Donald Trump: నేను మళ్లీ అధికారంలోకి వస్తే.. ఆ హక్కు ఉండదు: ట్రంప్
-
Politics News
MLC Kavitha: బ్రిజ్ భూషణ్పై చర్యలేవీ?: కేంద్రాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత