Tamil Nadu: నా భార్యను అర్ధనగ్నంగా చేసి 120 మంది దాడి.. డీజీపీకి ఆర్మీజవాన్ ఫిర్యాదు
తమిళనాడులో నివాసం ఉంటున్న తన భార్యపై 120 మంది దాడి చేశారని ఓ ఆర్మీ జవాను వాపోయాడు. తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆ రాష్ట్ర డీజీపీకి ఓ వీడియోలో విజ్ఞప్తి చేశాడు.
ఇంటర్నెట్డెస్క్: తమిళనాడు(Tamil Nadu)లో ఉన్న తన భార్యపై దాదాపు 120 మంది దాడి చేశారని ఆరోపిస్తూ ఓ జవాను వీడియో రూపంలో రాష్ట్ర పోలీసులు, డీజీపీకి ఫిర్యాదు చేశాడు. ఈ వీడియోను ఆర్మీ విశ్రాంత లెఫ్టినెంట్ కర్నల్ ఎన్.త్యాగరాజన్ ట్విటర్లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. తమిళనాడుకు చెందిన ప్రభాకరన్ ఆర్మీలో హవాల్దార్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రభాకరన్ చెబుతున్న ఘటన నాగపట్నం జిల్లాలోని కందవాసల్లో చోటు చేసుకొంది.
ఈ వీడియోలో ప్రభాకరన్ మాట్లాడుతూ ‘‘నా భార్య ఓ స్థలాన్ని లీజుకు తీసుకొని దుకాణం నిర్వహిస్తోంది. ఆమెపై 120 మంది దాడి చేసి కొట్టారు. షాపులో వస్తువులను ధ్వంసం చేశారు. నేను ఎస్పీకి ఫిర్యాదు చేశాను. ఆయన హామీ ఇచ్చారు. డీజీపీ సర్, దయ చేసి సాయం చేయండి. వారు కత్తులతో నా కుటుంబంపై దాడి చేసి బెదిరిస్తున్నారు. నా భార్యను అర్ధనగ్నంగా చేసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు’’ అని పేర్కొన్నాడు.
మరోవైపు కందవాసల్ పోలీసుల వాదన దీనికి భిన్నంగా ఉంది. విషయాన్ని సదరు జవాను పెద్దది చేసి చెబున్నారని పేర్కొన్నారు. ‘‘ప్రభాకరన్ చెబుతున్న దుకాణం ఓ దేవాలయానికి చెందిన భూమి. అతడి మామ సెల్వమూర్తి రూ.9.5 లక్షలకు కుమార్ అనే వ్యక్తి నుంచి దానిని లీజుకు తీసుకొన్నాడు. ఇందుకోసం కుమార్కు నగదు చెల్లించాడు. ఆ తర్వాత కుమార్ చనిపోయాడు. అతడి కుమారుడు రాము సదరు దుకాణాన్ని తిరిగి తీసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో నగదు వాపస్ ఇచ్చేందుకు రాముతో సెల్వమూర్తికి అంగీకారం కూడా కుదిరింది. కానీ, ఆ తర్వాత సెల్వమూర్తి నగదు వాపస్ తీసుకొనేందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో జూన్ 10న రాము ఆ దుకాణం వద్దకు వెళ్లి సెల్వమూర్తి కుమారులు జీవా, ఉదయ్లకు నగదు వాపస్ చేశాడు. కానీ, వారు ‘తనపై కత్తితో దాడి చేశార’ని ఆరోపించాడు. చుట్టపక్కల వారు రాముకు మద్దతుగా వచ్చి ఆ షాపుపై దాడి చేశారు. ఆ సమయంలో ప్రభాకరన్ భార్య కీర్తి, ఆమె తల్లి దుకాణంలో ఉన్నారు. వారిపై దాడి జరగలేదు. అదే రోజు సాయంత్రం కీర్తి ఆసుపత్రిలో చేరింది. దీంతో ప్రభాకరన్ ఆమెపై దాడి జరిగిందని చెబుతున్నాడు’ అని పోలీసులు తెలిపారు. ఇరు పక్షాలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో వైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకొంది. తమిళనాడు భాజపా చీఫ్ కె.అన్నామలై ఆర్మీ జవాన్ కుటుంబానికి మద్దతు ప్రకటించారు. సదరు ఆర్మీ జవాను భార్యకు న్యాయం లభించేలా చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. జవాన్ కుటుంబానికి భాజపా అండగా ఉంటుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
అటల్ సేతు గురించి సినీనటి రష్మిక (Rashmika Mandanna) మాట్లాడిన వీడియోపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
Swati Maliwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టాడని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. కడుపుపై కొట్టి, కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి