నీటిలో తేలియాడుతున్న శరీర భాగాలు.. శకలాలు!
ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే అదృశ్యమైన విమాన ఘటన దాదాపు విషాదాంతమైనట్లే తెలుస్తోంది. విమాన ఆచూకీ కోసం శనివారం ముమ్మరంగా గాలిస్తున్న సిబ్బంది...............
దాదాపు విషాదాంతమైన ఇండోనేసియా విమాన అదృశ్య ఘటన!
జకార్తా : ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే అదృశ్యమైన విమాన ఘటన దాదాపు విషాదాంతమైనట్లే తెలుస్తోంది. విమాన ఆచూకీ కోసం శనివారం మొదలుపెట్టిన గాలింపులో ఆదివారం ఉదయం నాటికి కొంత పురోగతి కనిపించింది. ఈ రోజు ఉదయం జావా సముద్రంలో కొంతమంది శరీర భాగాలు, దుస్తులు సహా కొన్ని విమాన శకలాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విమానం కూలిన ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆ దేశ రావాణాశాఖ మంత్రి బుది కార్య సుమది తెలిపారు. ఇప్పటి వరకు లభించిన శకలాలు లాంకాంగ్, లకీ ద్వీపాల మధ్య కనుగొన్నట్లు వెల్లడించారు. చివరిసారి అందిన సంకేతాల ఆధారంగా విమానం అదశ్యమైన ప్రాంతాన్ని గుర్తించేందుకు అటు నావికాదళం సైతం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విమానం అదశ్యమై దాదాపు 16 గంటలు గడుస్తున్నా.. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
జకార్తా నుంచి పోంటియానక్కు బయల్దేరిన బోయింగ్ 737-500 విమానం శనివారం మధ్యాహ్నం అదృశ్యమైన విషయం తెలిసిందే. దీనిలో 12 మంది సిబ్బంది, 50 మంది ప్రయాణికులు కలిపి 62 మంది ఉన్నారు. టేకాఫ్ అయిన నాలుగు నిమిషాల్లోనే రాడార్పై నుంచి అదృశ్యమయింది. శ్రీవిజయ విమానయాన సంస్థకు చెందిన ఈ విమానం ఆచూకీ కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతోంది. విమాన శకలాలుగా అనుమానిస్తున్న లోహపు భాగాలను, కొన్ని తీగలను ఉత్తర జకార్తాలోని థౌజండ్ ఐలాండ్స్ (ద్వీపాల సముదాయం)లో గుర్తించినట్లు మత్స్యకారులు తెలిపారు. తమకు 30 మీటర్ల దూరంలో పిడుగుపాటు, బాంబుపేలుడు వంటిదేదో సంభవించినట్లు అనిపించిందని చెప్పారు.
ఇవీ చదవండి..
డొనాల్డ్ ట్రంప్ నెత్తిన కత్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.