అఫ్గాన్‌లో బాంబు పేలుళ్లు.. ఏడుగురి మృతి

అఫ్గానిస్థాన్‌లోని హెల్మండ్‌ ప్రావిన్సులో జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రావిన్సు

Published : 10 Oct 2020 21:43 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లోని హెల్మండ్‌ ప్రావిన్సులో జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రావిన్సు గవర్నర్‌ ఉమర్‌ జాక్‌ ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించారు. రోడ్డు పక్కన దాచి ఉంచిన పేలుడు పదార్థాల వల్లే ఘటన జరిగినట్లు ఆయన వివరించారు. దీంతో పాటు శనివారం ఉదయం ఈ ఘటనకు ముందు మరొక బాంబు పేలుడు జరిగింది. హెరాత్‌- కందహర్‌ మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయాల పాలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని