కశ్మీర్లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా చెక్‌ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి.

Published : 27 Apr 2024 05:31 IST

ఇద్దరు జవాన్లకు గాయాలు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా చెక్‌ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో శుక్రవారం ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా.. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. గురువారం ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో ఒక పౌరుడు గాయపడ్డారని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను ఏరిపారేసేవరకూ ఈ ఆపరేషన్‌ కొనసాగుతుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని