Cheetah helicopter: కుప్పకూలిన ఇండియన్‌ ఆర్మీ హెలికాప్టర్‌.. పైలట్‌ మృతి

ఇండియన్‌ ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్‌ కుప్పకూలింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో పైలట్‌ మృతిచెందారు.

Published : 05 Oct 2022 14:02 IST

తవాంగ్‌: భారత పదాతిదళానికి చెందిన చీతా హెలికాప్టర్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఓ పైలట్‌ ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తవాంగ్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఇండియన్‌ ఆర్మీ తెలిపింది. రోజువారీ విధుల్లో భాగంగా చక్కర్లు కొడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సైనిక బృందాలు ఇరువురు పైలట్లను సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. వీరిలో ఒకరు లెఫ్టినెంట్‌ కర్నల్‌ సౌరభ్‌ యాదవ్‌ చికిత్స పొందుతూ మరణించినట్లు పేర్కొంది. మరొకరికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతున్నట్లు తెలిపింది. ప్రమాదానికి గల కారణాలను అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని