Delhi Liquor scam: బెయిల్‌ కోసం.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన సిసోదియా

మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలపై అరెస్టయిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్‌ నేత మనీశ్ సిసోదియా బెయిల్‌ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Published : 06 Jul 2023 17:02 IST

దిల్లీ: మద్యం కుంభకోణం (Liquor scam)కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై అరెస్టయిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నేత మనీశ్ సిసోదియా (Manish Sisodia)బెయిల్‌ కోసం గురువారం సుప్రీం కోర్టు (supreme court)ను ఆశ్రయించారు.

దిల్లీ హైకోర్టు (Delhi High court)లో సిసోదియా దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే.. దీన్ని సవాల్‌ చేస్తూ ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తూ మరోసారి పిటిషన్‌ దాఖలు చేశారు. మద్యం కుంభకోణం కేసులో మనీశ్‌ సిసోదియాను ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై మే 9న ఈడీ అధికారులు ఆయన్ను అరెస్టు చేసి తిహాడ్‌ జైలులోనే విచారించారు. గత మే 30న బెయిల్‌ కోసం దిల్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా నిరాశే ఎదురైంది. మరోసారి ఆశ్రయించగా.. ఈ దశలో బెయిల్‌ మంజూరు చేయలేమని దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి తేల్చి చెప్పారు. సిసోదియాతో పాటు ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న అభిషేక్‌ బోయినపల్లి, వినయ్‌బాబు, విజయ్‌ నాయర్‌కు సైతం బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు