Statue of liberty: అమెరికాకు చేరనున్న‘లిటిల్ సిస్టర్’
స్నేహబంధానికి గుర్తుగా 135 ఏళ్ల కిందట అమెరికాకు ఫ్రాన్స్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని బహుకరించిన విషయం తెలిసిందే. 1886లో ఫ్రాన్స్ ప్రభుత్వం బహుకరించిన 46 మీటర్లు(151అడుగుల 1 అంగుళం) ఎత్తున్న ఈ ప్రతిమ న్యూయార్క్ నగరంలో ఇప్పటికీ పర్యటకులను ఆకట్టుకుంటోంది. అయితే, తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం అమెరికాకు మరోసా
(Photo: nps.gov)
వాషింగ్టన్: స్నేహబంధానికి గుర్తుగా అమెరికాకు ఫ్రాన్స్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని బహుకరించిన విషయం తెలిసిందే. 1886లో ఫ్రాన్స్ బహుకరించిన 46 మీటర్లు(151అడుగుల 1 అంగుళం) ఎత్తున్న ఈ విగ్రహం న్యూయార్క్లో ప్రముఖ పర్యాటక ప్రాంతం. అయితే, తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం అమెరికాకు మరోసారి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని బహుమతిగా ఇవ్వనుంది. ఇప్పటికే ఆ బహుమతిని ఫ్రాన్స్ పంపించగా.. అది వచ్చే నెలలో అమెరికాను చేరుకోనుంది.
135 ఏళ్ల కిందట అమెరికాకు బహుకరించిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వంటి విగ్రహన్నే ఫ్రాన్స్ గతంలో పది అడుగుల ఎత్తుతో కాంస్యంతో తయారు చేయించి పారిస్లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఏర్పాటు చేసింది. ఇది న్యూయార్క్లో ఉన్న అసలైన విగ్రహంలో 1/16 వంతు ఉంటుంది. దీనికి లిటిల్ సిస్టర్ అని నామకరణం చేశారు. ఇప్పుడు ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని అమెరికాతో స్నేహం ఎప్పటికీ నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఆ దేశానికి బహుమతిగా ఇచ్చారు.
అయితే, ఈ లిటిల్ సిస్టర్ విగ్రహాన్ని మొదట న్యూయార్క్లోని లిబర్టీ ఐలాండ్ సమీపంలో ఉన్న ఎల్లిస్ ఐలాండ్లో ఏర్పాటు చేయనున్నారు. జులై 1 నుంచి జులై 5వ తేది వరకు అక్కడ సందర్శనకు ఉంచి.. ఆ తర్వాత వాషింగ్టన్ డీసీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేయబోతున్నారట. అక్కడ ఈ విగ్రహం పదేళ్ల పాటు ఉండనుందని ఫ్రాన్స్ అధికారులు వెల్లడించారు. ‘‘అమెరికాకు మేము (ఫ్రాన్స్) చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. అమెరికాతో స్నేహం మాకు ఎంతో ముఖ్యం. ఈ స్నేహాన్ని ఇలాగే కొనసాగించాలి’’అని ఫ్రాన్స్ నేషనల్ మ్యూజియం జనరల్ అడ్మినిస్ట్రేటర్ ఒలివర్ ఫారొన్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.