ఫ్రాన్స్: మూడో ధాటికి మూడోసారి లాక్డౌన్!
ఫ్రాన్స్ మరోసారి లాక్డౌన్కు సిద్ధమయ్యింది. ప్రస్తుతం అక్కడ కరోనా మూడో దఫా విజృంభణతో మూడోసారి లాక్డౌన్ విధించక తప్పడంలేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించారు.
ప్రకటించిన అధ్యక్షుడు మేక్రాన్
పారిస్: ఏడాది గడుస్తోన్నా.. కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఫ్రాన్స్ మరోసారి లాక్డౌన్కు సిద్ధమయ్యింది. ప్రస్తుతం అక్కడ కరోనా మూడో దఫా విజృంభణతో మూడోసారి లాక్డౌన్ విధించక తప్పడం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించారు.
కరోనా వైరస్ తీవ్రతకు ఫ్రాన్స్ మరోసారి వణికిపోతోంది. ఇప్పటికే అక్కడ మూడోదఫా(థర్డ్వేవ్) విజృంభణ కొనసాగుతోంది. ఫ్రాన్స్లో కొవిడ్ మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. కరోనా రోగులతో అక్కడి ఆసుపత్రుల్లో అత్యవసర విభాగాలు కిక్కిరిసిపోతున్నాయి. వీటివల్ల ఆసుపత్రులు, ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరోసారి పూర్తి లాక్డౌన్ విధించక తప్పని పరిస్థితి ఏర్పడిందని మేక్రాన్ ప్రకటించారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి వ్యవస్థలన్నీ తెరిచే ఉంచాలనే తన లక్ష్యాన్ని మెక్రాన్ వదులుకోవాల్సి వచ్చింది.
‘ప్రస్తుతం మనం సరైన చర్యలు తీసుకోకుంటే..నియంత్రణ కోల్పోతాం’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ లాక్డౌన్ ప్రకటన సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆంక్షలు ఉన్నాయని.. ప్రస్తుతం వీటిని దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ తొలి శనివారం నుంచి మూడు వారాలపాటు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించారు.
కొవిడ్ కేసుల్లో ప్రపంచంలోనే నాలుగో స్థానం..
కరోనా వైరస్ విజృంభణతో గతేడాది తీవ్రంగా నష్టపోయిన ఫ్రాన్స్..మరోసారి లాక్డౌన్ విధించేందుకు అధ్యక్షుడు మేక్రాన్ సుముఖత చూపలేదు. మరోసారి లాక్డౌన్ విధించకుండానే దేశాన్ని ముందుకు నడుపుతానని పలు సందర్భాల్లో వెల్లడించారు. తద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తానని ధీమా వ్యక్తంచేశారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో మూడోసారి లాక్డౌన్ విధించక తప్పలేదని తెలుస్తోంది. జాన్స్హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం, ఫ్రాన్స్లో కొవిడ్ కేసుల సంఖ్య 47లక్షలు దాటగా, దాదాపు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ కేసుల్లో భారత్ మూడోస్థానంలో ఉండగా, ఫ్రాన్స్ ప్రపంచంలోనే నాలుగోస్థానంలో ఉంది. ప్రస్తుతం అక్కడ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ పొరుగుదేశం బ్రిటన్తో పోలిస్తే వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. లాక్డౌన్తో ఇది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ, అధ్యక్షుడు మాత్రం జూన్ నాటికి దేశ జనాభాలో సగం మందికి(3కోట్ల మందికి) వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
మహిళలపై లైంగిక వేధింపులు, అపహరణల అంశానికి సంబంధించి హెచ్డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్పై కేసులు నమోదయ్యాయి. -
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
లోక్సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?