ఎంఎస్ఎంఈలకు రూ.3లక్షల కోట్ల రుణాలు
కరోనా సంక్షోభంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.3లక్షల కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కరోనా సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు
దిల్లీ: కరోనా సంక్షోభంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.3లక్షల కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కరోనా సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ వివరాలను ఆమె వెల్లడించారు. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘సూక్ష్మ, మధ్య, లఘు, కుటీర పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)కు రూ.3లక్షల కోట్లు ఎలాంటిపూచీకత్తు లేకుండా రుణాలిస్తాం. 12 నెలల మారటోరియంతో ఈ రుణాలు మంజూరుచేస్తాం. ఎంఎస్ఎంఈలకు ఆరు అంశాల్లో ఆర్థిక ప్యాకేజీతో ప్రయోజనం కలుగుతుంది. ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను ఇవాళ్టి నుంచి ఒక్కొక్కటిగా వివరాలను ప్రకటిస్తాం. రూ.5లక్షల లోపు ఆదాయ పన్ను రీఫండ్ బకాయిలు వెనక్కి చెల్లించాం. భారత్ స్వయం శక్తితో ఎదగాలనేదే మా లక్ష్యం’’ అని అన్నారు.
ఉద్యోగుల భద్రతకు తోడ్పాటు
‘‘ఈ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటాయింపులు చేస్తాం. ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం రూ.10వేల కోట్లతో ఫండ్ ఏర్పాటు. ఎంఎస్ఎంఈలకు ఆరు అంశాల్లో ఆర్థిక ప్యాకేజీతో ప్రయోజనం చేకూరనుంది. ఎంఎస్ఎంఈలు తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు ఇది దోహదపడుతుంది. ఉద్యోగుల భద్రత కల్పించేందుకు ఉపయోగపడుతుంది. అన్ని విభాగాల్లోనూ నగదు లభ్యతే ప్రధాన సమస్యగా ఉంది. తీవ్రమైన రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ.20వేల కోట్లు; ఎంఎస్ఎంఈల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం రూ.50వేల కోట్లు కేటాయింపు. ఈ ప్యాకేజీతో రెండు లక్షల చిన్న తరహా పరిశ్రమలకు ప్రయోజనం కలగనుంది. ఎంఎస్ఎంఈల నిర్వచనంపై కొంత అయోమయం ఉంది. ఇప్పుడు మేలు చేసేలా కొత్త నిర్వచనం ఇస్తున్నాం’’ అని నిర్మల పేర్కొన్నారు.
నవభారత్ నిర్మాణమే మూల సూత్రంగా..
‘‘ప్రధాని ఒక సమగ్రమైన దార్శినికతను దేశం ముందుంచారు. దేశ ఆర్థిక వృద్ధిని పెంచి స్వయం సమృద్ధి భారతే లక్ష్యంగా ఈ ప్యాకేజీ ప్రకటించారు. ఆర్థిక, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, జనాభా, డిమాండ్ అనే ఐదు మూల సూత్రాలుగా ఈ ప్యాకేజీ ఉంటుంది. స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడమే లక్ష్యం. గత 40 రోజుల్లో మన శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసింది. పీపీఈ కిట్లు, మాస్క్ల తయారీలో ఎంతో ప్రగతి సాధించాం. నవ భారత్ నిర్మాణమే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ మూల సూత్రం’’ అని తెలిపారు.
ఆత్మ నిర్భర్ భారత్తో ప్రజలకు కొత్త ఉత్తేజం
‘‘గడిచిన ఐదేళ్లలో ఎన్నో విధాలుగా సంస్కరణల్ని అమలు చేశాం. ప్రత్యక్ష నగదు బదిలీ మా సంస్కరణలకు మేలిమి ఉదాహరణ. భూమి, నగదు లభ్యత, పాలనాపరమైన విధానాలే కీలకం. డీబీబీ, సూక్ష్మస్థాయి బీమాలతో ప్రజలకు ఎతో మేలు జరుగుతుంది. స్వచ్ఛభారత్ అభియాన్, ఆయుష్మాన్ భారత్ మేం చేపట్టిన కీలక పథకాలు. ఎఫ్ఢీఐ నిబంధనలకు సరళీకరించి పెట్టుబడులకు మార్గం సుగమమం చేశాం. తాజాగా ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ నినాదం దేశ ప్రజలకు కొత్త ఉత్తేజం ఇస్తుంది. కరోనా కష్టాల నుంచి పేదలకు ఉపశమనం కోసం గరీబ్ కల్యాణ్ యోజన అమలు చేస్తున్నాం’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
నోటా విజేతగా నిలిస్తే?
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?