ఇరు దేశాలు అమలు చేస్తాయి: చైనా

భారత్‌, చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల సడలింపునకు రెండు దేశాలు సానుకూల ఏకాభిప్రాయాన్ని అమలు చేయడం ప్రారంభించాయని చైనా వెల్లడించింది.

Published : 10 Jun 2020 17:17 IST

బీజింగ్: భారత్‌, చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల సడలింపునకు రెండు దేశాలు సానుకూల ఏకాభిప్రాయాన్ని అమలు చేయడం ప్రారంభించాయని చైనా వెల్లడించింది. సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై జూన్‌ 6న ఇరు దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికారుల మధ్య సుదీర్ఘ భేటీ జరిగిన సంగతి తెలిసిందే. తూర్పు లద్దాఖ్, పాంగాంగ్ సెక్టార్‌లోని చైనా బలగాలు వెనక్కు మళ్లుతున్నట్లు, విరమణ ప్రక్రియ ప్రారంభించినట్లు మంగళవారం భారత ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈక్రమంలో చైనా నుంచి ఈ ప్రకటన వెలువడింది. 
దీనిపై ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యుంగ్ మాట్లాడుతూ..ఇటీవల చైనా, భారత సైనిక, దౌత్య అధికారుల మధ్య సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై సంప్రదింపులు జరిగాయి. ఆ అంశంపై ఇరువర్గాలు సానుకూల ఏకాభిప్రాయానికి వచ్చాయి. అక్కడి ఉద్రిక్త వాతావరణాన్ని సడలించడానికి రెండు వైపులా ఈ ఏకాభిప్రాయాన్ని అమలుచేస్తాయి’ అని వెల్లడించారు.  

తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద మే 5న చైనా బలగాలు మోహరించడం ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. దౌలత్ బేగ్ ఓల్డీకి వెళ్లేందుకు భారత్ నిర్మిస్తోన్న రోడ్డు నిర్మాణంపై చైనా వ్యతిరేకత ఈ ప్రతిష్టంభనకు కారణం. దాన్ని తొలగించేందుకు జూన్‌ 6న రెండు దేశాలకు చెందిన సైనికాధికారులు భేటీ అయ్యారు. ఆ చర్చల ఫలితంగానే చైనా సైన్యాలను వెనక్కి మళ్లిస్తోంది. 

ఇవీ చదవండి:

చైనా మైండ్‌గేమ్..!


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని