‘గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి’
ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. లాక్డౌన్, షట్డౌన్లు సైతం వైరస్ కట్టడిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవున్నాయి.........
ఆధారాలు ఉన్నాయంటున్న 239 మంది శాస్త్రవేత్తల బృందం
డబ్ల్యూహెచ్వోకు లేఖ
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. లాక్డౌన్, షట్డౌన్లు సైతం వైరస్ కట్టడిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవున్నాయి. అమెరికా వంటి దేశాల్లో తగ్గుముఖం పట్టినట్టే పట్టి మరోసారి తీవ్రరూపం దాలుస్తోంది. సామాజిక దూరం, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వినియోగం వంటి నియమాల్ని పాటిస్తున్నప్పటికీ.. వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి సంబంధించి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గాలి ద్వారా ఇది వ్యాపిస్తోందనే వాదన కొన్ని వర్గాల నుంచి కొంత కాలంగా వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ వాదనను బలపరుస్తూ ఓ శాస్త్రవేత్తల బృందం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో)కు లేఖ రాసింది. ఈ మేరకు అమెరికా పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది.
గాలిలో ఉండే చిన్న చిన్న కణాల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందనడానికి ఆధారాలున్నాయని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడికి సంబంధించిన సూచనలు, సిఫార్సులను సవరించాలని డబ్ల్యూహెచ్వోకు సూచించింది. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని ఆధారాలతో సహా వచ్చే వారం ఓ ప్రముఖ జర్నల్లో ప్రచురించనున్నట్లు 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. కరోనా బాధితులు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వెలువడే తుంపర్లు గాలిలోని చిన్న కణాల్లోకి ప్రవేశించి ఒక గది వంటి నిర్దేశిత ప్రాంతంలో తిరుగుతూ వైరస్ను వ్యాప్తి చేస్తాయని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. ఇందుకు భిన్నంగా డబ్ల్యూహెచ్వో మాత్రం కేవలం బాధితుల తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని చెబుతున్న విషయం తెలిసిందే.
ఈ కథనంపై డబ్ల్యూహెచ్వో ఇంకా స్పందించాల్సి ఉంది. గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందనడానికి బలమైన ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్వో ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జూన్ 29న విడుదల చేసిన మార్గదర్శకాల్లోనూ ఇదే విషయాన్ని పునరావృతం చేసింది. వైద్య ప్రక్రియల అనంతరం వెలువడే ఐదు మైక్రాన్ల(ఒక మైక్రాన్ అంటే మీటర్లో పదిలక్షలో వంతు ) కంటే చిన్న కణాల ద్వారా మాత్రమే వైరస్ వ్యాపించే అవకాశం ఉందని తెలిపింది. ఇది చాలా అరుదుగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గాలి ద్వారా వైరస్ వ్యాపించదని పరోక్షంగా చెప్పింది.
ఒకవేళ గాలి ద్వారా వైరస్ వ్యాపించే ఆస్కారముందన్న శాస్త్రవేత్తల వాదనే నిజమైతే.. మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కార్యాలయాలు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు సహా గాలి, వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో కట్టడి సవాల్గా పరిణమించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాల వంటి ప్రాంతాల్లో గాలి అక్కడే చక్కర్లు కొట్టకుండా బలమైన ఫిల్టర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం రావొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలపై అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం