US Military: తాలిబన్లకు చిక్కకుండా అమెరికా ఆయుఢాం
శత్రువులను నాశనం చేయడానికి ఆయుధాలను ఉపయోగిస్తుంటారు. అయితే అధునాతన అస్త్రం వారికి చిక్కకూడదనుకున్నప్పుడు దాన్నే నాశనం చేయడం సైనిక తంత్రం. అఫ్గానిస్థాన్
అస్త్రాలను పేల్చేసిన అగ్రరాజ్యం
శత్రువులను నాశనం చేయడానికి ఆయుధాలను ఉపయోగిస్తుంటారు. అయితే అధునాతన అస్త్రం వారికి చిక్కకూడదనుకున్నప్పుడు దాన్నే నాశనం చేయడం సైనిక తంత్రం. అఫ్గానిస్థాన్ నుంచి వైదొలిగిన అమెరికా సైన్యం ఇప్పుడు అదే పనిచేసింది. కోట్ల డాలర్ల విలువైన విమానాలు, వాహనాలు, అస్త్రాలను నిరుపయోగంగా మార్చేసి, తాలిబన్లకు ‘అందకుండా’ చేసింది. ఆగస్టు 14 నుంచి కాబుల్ విమానాశ్రయం కేంద్రంగా విదేశీయులు, సైనికుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సాఫీగా సాగడానికి వీలుగా ఎయిర్పోర్టును అగ్రరాజ్యం పూర్తిగా తన అధీనంలో ఉంచుకుంది. దీన్ని రక్షించడానికి దాదాపు 6వేల మంది సైనికులు, సాయుధ శకటాలు, ఇతర సాధన సంపత్తిని మోహరించింది. ‘ఆగస్టు 31 గడువు’ నేపథ్యంలో అఫ్గాన్ నుంచి హడావుడిగా తిరుగుప్రయాణమైన అమెరికా దళాలు తమ వెంట తీసుకెళ్లగలిగినంత సాధన సంపత్తిని స్వదేశానికి తరలించుకెళ్లాయి. తీసుకెళ్లలేమని భావించిన విమానాలు, వాహనాలు, ఆయుధాలను ధ్వంసం చేశాయి. వాటిలో ప్రధాన అస్త్రాలు..
* విమానాలు, హెలికాప్టర్లు: 73. వీటిలో ఏడు చినూక్ సీహెచ్-46 హెలికాప్టర్లూ ఉన్నాయి.
కాక్పిట్ కిటికీలను పేల్చేయడం, టైర్లను తుపాకులతో కాల్చడం సహా పలు పద్ధతుల్లో వాటిని నిర్వీర్యం చేశారు.
* మందుపాతరలనూ తట్టుకోగల ఎంఆర్ఏపీ సాయుధ శకటాలు: 70. ఒక్కో వాహనం ధర 10లక్షల డాలర్లు.
* తేలికపాటి ‘హమ్వీ’ రవాణా వాహనాలు: 27. ఒక్కో దాని విలువ లక్ష డాలర్లు.
* శత్రువులు ప్రయోగించే రాకెట్, శతఘ్ని, మోర్టార్ గుళ్లను పసిగట్టి, మార్గమధ్యంలోనే పేల్చివేసే సి-రామ్ వ్యవస్థ: 1. ధర కోటి-కోటిన్నర డాలర్లు. సోమవారం ఉగ్రవాదులు చేసిన రాకెట్ దాడుల నుంచి కాబుల్ విమానాశ్రయాన్ని రక్షించింది ఈ వ్యవస్థే.
లాడెన్ వేట సమయంలోనూ..
2011లో పాకిస్థాన్లోని అబోటాబాద్లో అల్ఖైదా ముఠా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ను అంతమొందించే ఆపరేషన్లోనూ అమెరికా స్వీయ హెలికాప్టర్ను పేల్చేసింది. ఆ దాడి కోసం అఫ్గాన్ నుంచి ‘సీల్స్’ కమాండోలను రెండు సరికొత్త శ్రేణి యూహెచ్-60 బ్లాక్హాక్ హెలికాప్టర్లలో తరలించారు. లాడెన్ నివాసానికి చేరుకున్నాక సాంకేతిక సమస్యతో ఒక లోహవిహంగం కుప్పకూలింది. అందులోని సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం ప్రత్యర్థుల చేతిలో పడకూడదని భావించిన కమాండోలు దాన్ని పేల్చేశారు. శత్రు రాడార్లను ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో ఈ హెలికాప్టర్ తయారైంది. అందుకే దాని రాకను పాక్ సైన్యం అప్పట్లో పసిగట్టలేకపోయింది. ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థ, అధునాతన నేవిగేషన్ కంప్యూటర్లూ ఆ హెలికాప్టర్లో ఉన్నాయి. నాడు లోహవిహంగంలోని తోక భాగం పేలిపోలేదు. అమెరికా హెచ్చరికలను బేఖాతురు చేస్తూ.. ఆ శకలాల వద్దకు చైనా సైన్యాధికారులను పాక్ అనుమతించింది. కొంతకాలం తర్వాత వాటిని అగ్రరాజ్యానికి అప్పగించేసింది.
కరిగించేసే గ్రెనేడ్లు
కొన్ని ఆయుధ వ్యవస్థలను నాశనం చేయడానికి అమెరికా సైనికులు ప్రత్యేక ‘థెర్మేట్ గ్రెనేడ్ల’ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. అవి పేలగానే దాదాపు 2,200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడుతుంది. అంత వేడిలో ఆయుధ వ్యవస్థలోని కీలక భాగాలు పూర్తిగా కరిగిపోతాయి.
- ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
నోటా విజేతగా నిలిస్తే?
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?