China: ఆయుధం ఎరవేసి.. బంగ్లాదేశ్పై పట్టుకు చైనా యత్నాలు
భారత్ చుట్టుపక్కల తన ప్రాబల్యాన్ని, పట్టును పెంచుకోవడానికి చైనా వ్యూహరచన చేస్తోంది. బంగ్లాదేశ్ను తన ఉక్కు కౌగిలిలో బంధించేందుకు
భారత్కు పొరుగున ప్రాబల్యం పెంచుకునేందుకు వ్యూహం
దిల్లీ: భారత్ చుట్టుపక్కల తన ప్రాబల్యాన్ని, పట్టును పెంచుకోవడానికి చైనా వ్యూహరచన చేస్తోంది. బంగ్లాదేశ్ను తన ఉక్కు కౌగిలిలో బంధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆ దేశానికి ఆయుధాలు ఎరవేస్తోంది. తాజాగా 44 తేలికపాటి ‘వీటీ5’ యుద్ధట్యాంకులను సరఫరా చేస్తోంది. సమీప భవిష్యత్లో మరిన్ని ట్యాంకులకు ఆర్డర్ దక్కించుకునే వీలుంది. ఈ ఆయుధాలతో కనీసం మూడు రెజిమెంట్లు ఏర్పాటు చేసుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా..
సైనిక దళాలను ఆధునికీకరించాలని బంగ్లాదేశ్ గట్టిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి చైనా ప్రధాన ఆయుధ సరఫరాదారుగా నిలిచే అవకాశం ఉంది. 2017లో బంగ్లాదేశ్.. బీఎన్ నబజాత్ర, బీఎన్ జాయజాత్ర అనే రెండు జలాంతర్గాములను డ్రాగన్ నుంచి కొనుగోలు చేసింది. శక్తిమంతమైన టోర్పిడోలు, సాగర మందుపాతరలను ప్రయోగించే సామర్థ్యం వీటికి ఉంది. ఇవి శత్రు యుద్ధనౌకలు, జలాంతర్గాములపై గణనీయ స్థాయిలో దాడి చేయగలవు.
- బంగ్లాదేశ్ సైన్యం ప్రధానంగా వినియోగించే బీడీ-08 తుపాకులకు మూలం చైనాకు చెందిన టైప్-81 అసాల్ట్ రైఫిల్. డ్రాగన్ సాంకేతిక తోడ్పాటుతో వీటిని రూపొందించారు. ఇవి అద్భుతంగా పనిచేశాయి. 4.5 కిలోల బరువుండే ఈ ఆయుధం 500 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని గురితప్పకుండా ఛేదించగలదు. నిమిషానికి 720 తూటాలను పేల్చగలదు. పనితీరు విషయంలో ఇది ఏకే-47 సహా ప్రపంచంలోని అత్యుత్తమ రైఫిళ్లకు ఏ మాత్రం తీసిపోదు.
- బంగ్లాదేశ్కు టైప్-69 అనే ప్రధాన యుద్ధ ట్యాంకులనూ చైనాయే సరఫరా చేసింది. ఇవేకాక ట్యాంకు విధ్వంసక క్షిపణులు, రాకెట్లు, రాకెట్ చోదిత గ్రెనేడ్లు, మోర్టార్లు, శతఘ్నులు, విమాన విధ్వంసక తుపాకులు, గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్లను అందించింది. బంగ్లాదేశ్ వైమానిక దళంలో ప్రధాన అస్త్రమైన చెంగ్డు ఎఫ్7 యుద్ధవిమానాలు కూడా చైనా నుంచి వచ్చినవే కావడం గమనార్హం.
ఆధునికం..
బంగ్లాదేశ్ ముద్రతో ఉన్న వీటీ5 ట్యాంకులు చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని నోరింకో పరిశ్రమలో కనిపించడంతో ఈ విషయం బయటపడింది. భారత్తో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి చైనా మోహరించిన టైప్ 15 ట్యాంకుల కన్నా ఇవి ఆధునికమైనవని, ఎన్నో మెరుగైన లక్షణాలు వాటిలో ఉన్నాయని సమాచారం.
- 30 టన్నుల బరువున్న ఈ ట్యాంకు చాలా సులువుగా ఎటుపడితే అటు కదులుతుంది.
- గరిష్ఠంగా గంటకు 70 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
- ఈ ట్యాంకులో 105 ఎంఎం స్మూత్బోర్ గన్, 12.7 ఎంఎం మెషీన్ గన్, 35 ఎంఎం గ్రెనేడ్ లాంచర్ వంటివి ఉన్నాయి.
- శత్రు దాడిని తట్టుకోగల అనేక రక్షణాత్మక అంశాలు దీని సొంతం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్