భారీ కుట్రకు రుజువులేమీ లేవు!
గుజరాత్ అల్లర్ల (2002) వెనుక భారీ కుట్ర ఉందన్న ఆరోపణలకు రుజువులేమీ లేవని
‘గుజరాత్ అల్లర్ల’పై సుప్రీంకు సిట్ నివేదన
దిల్లీ: గుజరాత్ అల్లర్ల (2002) వెనుక భారీ కుట్ర ఉందన్న ఆరోపణలకు రుజువులేమీ లేవని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం సుప్రీంకోర్టుకు నివేదించింది. నాటి అల్లర్ల వెనుక రాష్ట్ర ప్రభుత్వంలోని వ్యక్తులు, పోలీసులు, ఉద్యోగుల ప్రమేయం ఉందని చేస్తున్న ఆరోపణలు.. దుర్బుద్ధితో, విషయం ‘చల్లారకుండా ఉండేందుకు’ చేస్తున్నవిగా కనిపిస్తున్నాయని పేర్కొంది. గుజరాత్ అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపిస్తూ.. దీనిపై కేసు నమోదు కాలేదంటూ భర్తను కోల్పోయిన జకియా జఫ్రీ అనే మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదును పరిశీలించి చట్ట ప్రకారం వ్యవహరించాల్సిందిగా సుప్రీంకోర్టు గతంలో సిట్ను ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ ఏ.ఎం.ఖాన్విల్కర్ నేతృత్వంలోని జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సి.టి. రవికుమార్లతో కూడిన ధర్మాసనం ఎదుట సిట్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా గుల్బర్గా అల్లర్ల కేసులో ట్రయల్ కోర్టు తీర్పును రోహత్గి ఉటంకించారు. ‘‘గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసు విధి నిర్వహణలో కొందరి నిర్లక్ష్యం లేదా ఉల్లంఘనలకు సంబంధించింది అయి ఉండొచ్చు. కానీ అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, పోలీసులు, ఇతరుల కుట్రకు సంబంధించినది కాదు’’ అని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.