పెద్దింటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఆ మహిళకు శాపమైంది!
పెద్దింటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఆ మహిళకు శాపంగా మారింది. ప్రభుత్వ నల్లా వద్ద నీటిని పట్టుకోవద్దు,
మధ్యప్రదేశ్లో ఓ మహిళపై ఆంక్షలు
భోపాల్: పెద్దింటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఆ మహిళకు శాపంగా మారింది. ప్రభుత్వ నల్లా వద్ద నీటిని పట్టుకోవద్దు, గుడిలోకి రావద్దు అంటూ గ్రామంలోని పెద్దలు ఆంక్షలు విధించారు. మధ్యప్రదేశ్లోని హర్దా నగరంలో ఈ అమానుషం వెలుగు చూసింది. స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలో నివసించే ఓ దళిత మహిళ ఓ పెద్దింటి వ్యక్తిని ప్రేమించి.. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అగ్రవర్ణాలకు చెందిన పెద్దలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాహం జరిగినప్పటి నుంచి ఆ ప్రాంతంలోని వారు వేధించడం ప్రారంభించారని బాధిత మహిళ చెప్పారు. కులం పేరుతో దూషిస్తూ మానసికంగా బాధపెడుతున్నారని పేర్కొన్నారు. ఇంటి సమీపంలోని ప్రభుత్వ నల్లా వద్ద నీటిని పట్టుకునేందుకు సైతం అనుమతించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళితే మరుగుదొడ్డిపై రాళ్లు వేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. సమీపంలోని ఆలయంలోకీ తనను రానివ్వడం లేదని చెప్పారు. ఆలయంలోని పూజారి సైతం తన కుమార్తెను పలుమార్లు కొట్టి.. గుడిలో నుంచి తోసివేశారని తెలిపారు. ఒకసారి పూజారి కొట్టడం వల్ల తన కుమార్తె పెదవి పగిలిపోయిందని, గుడి బయటే ఉండి ప్రసాదం తీసుకోవాలని చెప్పేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరుగుతున్న అన్యాయంపై ఒకసారి అజాక్ ఠాణాలో, మరోసారి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్ల మరోమారు గత గురువారం ఎస్పీ కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.