Rajnath singh: అనిశ్చిత పరిస్థితుల్లో ఘర్షణ అనివార్యం: రాజ్నాథ్సింగ్
ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో ఘర్షణ ఏ రూపంలోనైనా ప్రారంభమయ్యే అవకాశం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సరిహద్దుల భద్రతకు ఎటువంటి సవాళ్లు ..
సవాళ్లు ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాల్సిందే
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ
దిల్లీ: ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో ఘర్షణ ఏ రూపంలోనైనా ప్రారంభమయ్యే అవకాశం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సరిహద్దుల భద్రతకు ఎటువంటి సవాళ్లు ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాల్సిందేనన్నారు. అటువంటి సన్నద్ధతకు ఉపయుక్తంగా ఉంటాయనే సరిహద్దుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడించారు.
సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్ఓ) నిర్మించిన 27 మౌలిక వసతుల ప్రాజెక్టులను రక్షణ మంత్రి మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దేశ ఉత్తర సరిహద్దుల్లో ఇటువంటి ప్రాజెక్టులు అందుబాటులోకి రాకుంటే శత్రువుల నుంచి ఎదురయ్యే ముప్పును గట్టిగా తిప్పికొట్టేందుకు మన సైన్యం సకాలంలో సన్నద్ధం కాలేదని వివరించారు. సరిహద్దుల్లో నిర్మించే రహదారులు, వంతెనలు, సొరంగమార్గాలు దేశ రక్షణలో ముఖ్య భూమికను వహిస్తాయని చెప్పారు. మౌలిక వ్యవస్థల నిర్మాణంతో పాటు నిఘా వ్యవస్థలనూ పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అత్యంత కీలకమైనది ఉమ్లింగ్ లా
రాజ్నాథ్ సింగ్ మంగళవారం ప్రారంభించిన 27 ప్రాజెక్టుల్లో మూడు రహదారులకు, 24 వంతెనలకు సంబంధించినవి. వంతెనల్లో జమ్మూకశ్మీర్-9, లద్దాఖ్-5, హిమాచల్ప్రదేశ్-5, ఉత్తరాఖండ్-3, అరుణాచల్ప్రదేశ్, సిక్కింలలో ఒక్కోక్కటి చొప్పున ఉన్నాయి. రహదారుల ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైనది సముద్ర మట్టానికి 19వేల అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్లింగ్ లా పాస్. 52 కి.మీ.పొడవైన ఈ మార్గం ద్వారా చిశుల్ నుంచి డెమ్చోక్కు చేరుకోవచ్చు. లేహ్ నుంచి వ్యూహాత్మక ప్రాంతమైన డెమ్చోక్కు వెళ్లేందుకు ఇది ప్రత్యామ్నాయ రహదారి. సైనిక దళాల తరలింపునకే కాకుండా పర్యాటకానికీ ఉపయోగపడుతుంది. ఈ మార్గంలోనే డొకలా వద్ద 11వేల అడుగుల ఎత్తులో నిర్మించిన 140 అడుగుల పొడవైన మాడ్యులర్ వంతెన ఉంది. ఈ తరహా మాడ్యులర్ వంతెనను దేశీయ పరిజ్ఞానంతో నిర్మించడం ఇదే ప్రథమం. దక్షిణ లద్దాఖ్లో నిర్మించిన ఈ రహదారి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో వాహనాలు వెళ్లేందుకు అనువుగా నిర్మించిన మార్గమని రక్షణ మంత్రి తెలిపారు. సంక్లిష్టమైన వాతావరణ పరిస్థితులను అధిగమిస్తూ బీఆర్ఓ ఈ రహదారిని నిర్మించి దేశానికి అందించడం ఎంతో గర్వించదగిన విషయమని పేర్కొన్నారు.
డోక్లాంకు ప్రత్యామ్నాయ రహదారి
చైనా సైన్యంతో 2017లో 73 రోజుల పాటు ప్రతిష్టంభన కొనసాగిన డోక్లాం ప్రాంతానికి ప్రత్యామ్నాయ రహదారి అందుబాటులోకి వచ్చింది. ఫ్లాగ్ హిల్ నుంచి డొక్లామ్ వెళ్లే ఈ రహదారి పొడవు 33 కి.మీ. దీనిద్వారా డోక్లాం ప్రాంతానికి మన సైన్యం త్వరగా చేరుకోవచ్చు. ఈ మార్గంలో భాగంగా మొత్తం 70 వంతెనలను నిర్మించారు. యుద్ద ట్యాంకులను తరలించేందుకు వీలుగా 70 టన్నులకు పైగా బరువును మోయగలిగే సామర్థ్యం వీటికి ఉంటుంది. భారత్-టిబెట్-భూటాన్ సరిహద్దులు కలిసే కూడలికి సమీపంగా వెళ్లేందుకు ఇది ప్రత్యామ్నాయ రహదారిగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు బీమ్ బేస్ నుంచి డొక్లామ్కు 2018లోని నిర్మించిన మార్గం ఒక్కటే అందుబాటులో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
నోటా విజేతగా నిలిస్తే?
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?