ఐఐటీల్లో ప్రవేశానికి ఇంటర్‌లో 75% మార్కుల నిబంధన సడలించలేం

ఐఐటీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో (హయ్యర్‌ సెకండరీ ఎగ్జామినేషన్‌) 75శాతం మార్కులు వచ్చి ఉండాలన్న నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Published : 30 May 2023 04:47 IST

పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

దిల్లీ: ఐఐటీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో (హయ్యర్‌ సెకండరీ ఎగ్జామినేషన్‌) 75శాతం మార్కులు వచ్చి ఉండాలన్న నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నిబంధన గతం నుంచీ ఉందని ఇందులో జోక్యం చేసుకోలేమని జస్టిస్‌ సుధాంశు ధూలియా, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ అభిప్రాయపడింది. ‘ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉంది..ఇప్పుడు దీంట్లో జోక్యం చేసుకోవడం ఎందుకు’ అని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని