Railway Track: పట్టాలెందుకు తప్పుతున్నాయి?
రైల్వే ప్రమాదం అనగానే తరచూ వినిపించే పదం పట్టాలు తప్పిందని! తాజాగా ఒడిశా ఘటనలోనూ కారణాలు స్పష్టంగా తెలియకున్నా రైలు పట్టాలు తప్పిందనేది తెలిసిపోతోంది.
అత్యధిక ప్రమాదాలకు కారణమదే
రైల్వేకు సవాలుగా మారిన ట్రాక్ ఫ్రాక్చర్లు
రైల్వే ప్రమాదం అనగానే తరచూ వినిపించే పదం పట్టాలు తప్పిందని! తాజాగా ఒడిశా ఘటనలోనూ కారణాలు స్పష్టంగా తెలియకున్నా రైలు పట్టాలు తప్పిందనేది తెలిసిపోతోంది.
ఇదొక్కటనే కాదు... మన దేశంలో ప్రతి ఏటా రైల్వే ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం 2021లో 18 వేల రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఎక్కువ పట్టాలు తప్పటం వల్లే! అసలెందుకింతగా దేశంలో రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయి? ఎందుకని రైళ్లు పదేపదే పట్టాలు తప్పుతున్నాయి?
డ్రైవర్లు, సిగ్నల్మ్యాన్ల పొరపాట్లు, కుట్ర కోణాల్లాంటి మానవ తప్పిదాలతో పాటు యాంత్రిక వైఫల్యాలను ప్రమాదాలకు కారణాలుగా చెబుతుంటారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిరుడు విడుదల చేసిన నివేదిక ప్రకారం... 2018-21 మధ్య చోటు చేసుకున్న రైలు ప్రమాదాల్లో ప్రతి పదింటిలో ఏడు- పట్టాలు తప్పటం వల్ల జరిగినవే! ఈ పట్టాలు తప్పటానికి ట్రాకుల్లో లోపాలు, నిర్వహణ సమస్యలు ప్రధాన సమస్యగా భావిస్తుంటారు.
ఎండదెబ్బకూ...
రైల్ (ట్రాక్) ఫ్రాక్చర్... ప్రమాదాలు జరిగినప్పుడల్లా తరచూ వినిపించే పదం ఇది. ముఖ్యంగా రైళ్లు పట్టాలు తప్పటానికి దీన్ని కీలకంగా చెబుతుంటారు. పట్టాలనేవి లోహాలతో చేసినవి. కొన్ని చోట్ల ఒకదానికొకటి వెల్డింగ్తోనో, బోల్టుల ద్వారానో కలిపి ఉంచేవి. నిత్యం రైలు చక్రాలతో ఘర్షణ కారణంగానో, లోహంలో లోపాల కారణంగానో, ఎక్కువ కాలం వాడటం వల్లో వీటిలో అక్కడక్కడా పగుళ్లు, చీలికల్లాంటివి తలెత్తుతుంటాయి. వీటినే ఫ్రాక్చర్ అంటారు. అంతేగాకుండా వాతావరణ మార్పుల వల్ల కూడా! ముఖ్యంగా వేసవి, శీతాకాలాల్లో వాతావరణ పరిస్థితుల కారణంగా రైల్వే ట్రాక్ల్లో ఏర్పడే సంకోచ, వ్యాకోచాల వల్ల కూడా ఈ ఫ్రాక్చర్లు ఏర్పడుతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి... సరిచేయటం రైల్వే శాఖకు పెద్ద సవాలు. ఈ క్రమంలో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ప్రమాదానికి దారితీయొచ్చు. ఎండనకా, వాననకా, రాత్రనకా, పగలనకా రైల్వే సిబ్బంది... వీటిని ఎప్పటికప్పుడు వేల కిలోమీటర్ల మేర, దేశవ్యాప్తంగా కనిపెట్టుకొని, మరమ్మతులు చేస్తూనే ఉంటారు. 2014లో రైల్వే శాఖ అంతర్గత నివేదికలో... ఈ ట్రాక్ ఫ్రాక్చర్లనేవి ఇంజినీరింగ్ (రైల్వే) విభాగానికి కత్తిమీద సాములా తయారయ్యాయని పేర్కొన్నారు.
నిర్వహణకు నిధులు లేవా?
కొత్త పట్టాలు వేయటానికి, పాతవాటిని ఆధునికీకరించటానికి రైల్వేలకు నిధులు అవసరం. ప్రపంచంలో అత్యంత పురాతనమైన రైల్వే వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వేలు నిర్వహణకు నిధులు సరిగ్గాలేక ఇబ్బందులు పడుతున్నాయంటారు. నిధుల కొరత ఉన్నా... అందుబాటులో ఉన్న నిధులను కూడా రైల్వే శాఖ సరిగ్గా వినియోగించుకోలేకపోతోందని కాగ్ నివేదిక ఎత్తిచూపింది. 2018-21 మధ్య 26శాతం రైళ్లు పట్టాలు తప్పటానికి ఇదే కారణమని కాగ్ విమర్శించింది.
* కొత్త రైళ్ల ప్రారంభంపై చాలాఖర్చు చేస్తున్నారు. కానీ... ఉన్న మౌలిక సదుపాయాల నిర్వహణ, ఆధునికీకరణలపై, రక్షణ వ్యవస్థలపై పెట్టాల్సినంతగా దృష్టిసారించటం లేదన్నది రైల్వేపై ప్రధాన ఆరోపణ.
* సాంకేతిక, ఆర్థిక సమస్యలు అలా ఉండగా.. నియమిత కాలపరిమితిలో చేపట్టాల్సిన పట్టాల నిర్వహణ మరమ్మతులకు సమయం సరిపోయినంతగా ఇవ్వకపోవటం అతి పెద్ద సమస్య అని రైల్వే లోకో రన్నింగ్ మెన్ సంఘం గతంలో ఆవేదన వ్యక్తంజేసింది. తక్కువ సమయంలో ఎక్కువ రైళ్లు నడపాలన్న ఒత్తిడి కారణంగా ఈ మరమ్మతులు, నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
* ఇందిరాగాంధీ ఓపెన్ వర్సిటీ 2018లో జరిపిన అధ్యయనం ప్రకారం... 2000-2016 మధ్య రైళ్లు పట్టాలు తప్పటం వల్ల కలిగిన ఆర్థిక నష్టం సుమారు రూ.86,486 కోట్లు.
మరి ఏం చేయాలి?
* అత్యంత క్లిష్టం, కీలకమైన పట్టాల నిర్వహణలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. తద్వారా ట్రాక్లో సమస్యలను వేగంగా గుర్తించి, పరిష్కరించటానికి వీలవుతుంది. ముఖ్యంగా రైల్వే ఫ్రాక్చర్లను గుర్తించటానికి సెన్సార్ ఆధారిత ఆటోమేటిక్ మిషిన్లను ప్రవేశపెట్టడం. కొంకణ్ రైల్వేలో 600 కిలోమీటర్ల మేర ఇలాంటి ఆస్ట్రేలియా సాంకేతికతను వినియోగించటం సత్ఫలితాలనిచ్చింది.
* జాతీయ నేర నమోదు విభాగం (ఎన్సీఆర్బీ)2022 నివేదిక ప్రకారం.. 2021తో పోలిస్తే రైల్వే ప్రమాదాలు 38.2% పెరిగాయి.
* మొత్తం 17,993 రైలు ప్రమాదాలు నమోదవగా వాటిలో అత్యధికంగా మహారాష్ట్ర (19.4శాతం), తర్వాత బెంగాల్లో జరిగాయి.
* 2021లో 17,993 ప్రమాదాలు జరగ్గా... 16,431 మంది మరణించారు. 1,852 మందికి గాయాలయ్యాయి.
* 11,036 మంది ట్రాక్లపై రైళ్లను ఢీకొనో, రైళ్ల నుంచి పడిపోయో మరణించారు.
* 2020లో 13,018 రైలు ప్రమాదాలు జరగ్గా.. 12వేల మంది ప్రయాణికులు మరణించారు. 2019లో భారత్లో రైలు ప్రమాదాల సంఖ్య 27,987గా నమోదైంది.
‘‘ప్రభుత్వం రైల్వేల నుంచి ఇంకా ఎక్కువ ఆదాయం ఎలా పొందాలని మాత్రమే ఆలోచించకుండా... రైల్వేలకు నిధులను ఎక్కువగా కేటాయించాలి.’’
రైల్వే మాజీ మంత్రి దినేశ్ త్రివేది
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలపై అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం