అమెరికాలో భారత స్వాతంత్య్ర వేడుకకు రవిశంకర్‌, సమంత

అమెరికాలోని భారత సంతతి అమెరికన్లు ఈ నెల 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌ నగర వీధుల్లో జరిపే వార్షిక ప్రదర్శనకు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ సారథ్యం వహించనున్నారు.

Published : 11 Aug 2023 05:25 IST

న్యూయార్క్‌: అమెరికాలోని భారత సంతతి అమెరికన్లు ఈ నెల 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌ నగర వీధుల్లో జరిపే వార్షిక ప్రదర్శనకు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ సారథ్యం వహించనున్నారు. నటీమణి సమంత ప్రధాన అతిథిగా, బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ గౌరవ అతిథిగా పాల్గొంటారు. న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెక్టికట్‌, న్యూ ఇంగ్లండ్‌లకు చెందిన భారతీయ సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఏ) ఈ నెల 20న జరిపే ఈ 41వ ఇండియా డే పరేడ్‌ భారతీయ విలువలు, ఆశయాలను ప్రతిబింబిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని