ఈ మహిళ చిరంజీవి..

పట్టాలు దాటుతున్న సమయంలో వేగంగా దూసుకొస్తున్న రైలును చూసి ఆమె మెదడు మొద్దుబారిపోయింది.

Published : 29 Aug 2023 05:17 IST

రైలు ఢీ కొట్టకుండా పట్టాల మధ్య పడుకున్న వైనం

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే: పట్టాలు దాటుతున్న సమయంలో వేగంగా దూసుకొస్తున్న రైలును చూసి ఆమె మెదడు మొద్దుబారిపోయింది. రైలు ఇక తన వద్దకు వచ్చేస్తున్న తరుణంలో పట్టాలపై ముడుచుకుని పడుకుని ఆ మహిళ ప్రాణాలను రక్షించుకున్నారు. బెంగళూరు యలహంక సమీపంలోని రాజానుకుంటె రైల్వేస్టేషన్‌ వద్ద సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు మహిళ పట్టాలు దాటుతుండగా గూడ్స్‌ రైలు దూసుకొచ్చిన సమయంలో చోటుచేసుకున్న ఘట్టాలివి. సరైన సమయంలో ఆమె పట్టాల మధ్యలో పడుకోవడంతో బండి ఢీ కొట్టకుండా తప్పించుకున్నారని రైల్వే పోలీసులు తెలిపారు. రైలు వెళ్లిపోయాక.. అక్కడున్న ఆమె కుమార్తె అమ్మను పట్టుకుని ఏడ్చేశారు. అక్కడున్న ప్రయాణికులు మహిళకు ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని