మహిళా బిల్లులో ఏముంది?
మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం కోసం ప్రవేశపెట్టిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా రాజ్యాంగంలోని 239ఏఏ, 330, 332, 334 అధికరణలకు సవరణలు చేస్తున్నారు.
పలు అధికరణలకు సవరణలు
కేంద్ర, రాష్ట్రాల్లో కోటాకు ఏర్పాట్లు
ఈనాడు, దిల్లీ: మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం కోసం ప్రవేశపెట్టిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా రాజ్యాంగంలోని 239ఏఏ, 330, 332, 334 అధికరణలకు సవరణలు చేస్తున్నారు.
- ఆర్టికల్ 239ఏఏ క్లాజ్ (2), సబ్క్లాజ్ (బి)కింద కొత్తగా బీఏ, బీబీ, బీసీ క్లాజులను చేర్చారు.
- ఆర్టికల్ 330 కింద కొత్తగా 330ఏ(1)(2)(3)ని చేర్చారు.
- ఆర్టికల్ 332 కింద 332ఏ (1)(2)(3)క్లాజ్లు చేర్చి దిల్లీ అసెంబ్లీ, దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, వాటి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించారు.
- ఆర్టికల్ 334లో కొత్తగా 334ఏ(1) చేర్చి ఇప్పుడు ప్రకటించిన రిజర్వేషన్లన్నీ ఈ చట్టం అమల్లోకి వచ్చాక చేపట్టే జనగణన అనంతరం నిర్వహించే డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాతే అమల్లోకి వచ్చేలా చూశారు. అప్పటివరకు ఇప్పుడున్న సీట్లన్నీ యథాతథంగా కొనసాగుతాయని స్పష్టత ఇచ్చారు. రాష్ట్రాలు, జాతీయ స్థాయిల్లో జరిగే విధాన రూపకల్పనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకే ఈ బిల్లు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం ఈ బిల్లు ఉద్దేశాలు, కారణాల్లో (ఆబ్జెక్టివ్స్ అండ్ రీజన్స్)లో పేర్కొంది. ‘75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత దేశం 2047కల్లా అభివృద్ధి చెందిన భారత్గా అవతరించాలన్న లక్ష్యంతో అమృత్ కాలంలోకి ప్రవేశించింది. ఈ లక్ష్యాన్ని సాకారం చేసుకోవాలంటే సబ్కా సాథ్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాల చేయూత అవసరం. జనాభాలో సగభాగం ఉన్న మహిళల పాత్ర ఇందుకు అత్యంత ప్రధానం. మహిళా సాధికారిత, మహిళాధారిత అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మహిళల శక్తిని వెలికితీయడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. దానివల్ల మహిళల ఆర్థిక స్వాతంత్య్రం, విద్య, ఉద్యోగావకాశాలను అందుకోవడంలో ఎంతో మెరుగుదల కనిపించింది. ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం, ముద్ర యోజనతో ఆర్థిక సమ్మిళితత్వంలాంటి కార్యక్రమాల ద్వారా మహిళల జీవనాన్ని సుగమం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే విధానాల రూపకల్పన, నిర్ణయాధికార ప్రక్రియలో మహిళలు పెద్ద సంఖ్యలో భాగస్వాములైనప్పుడే నిజమైన సాధికారత సాధ్యమవుతుంది.పంచాయతీరాజ్ సంస్థలు, మున్సిపల్ వ్యవస్థల్లో మహిళల భాగస్వామ్యం పెద్దసంఖ్యలో ఉంది. అయితే అసెంబ్లీలు, పార్లమెంటులో వారి భాగస్వామ్యం ఇప్పటికీ పరిమితమే. రాష్ట్ర, జాతీయ స్థాయిలో వారికి అధిక ప్రాతినిధ్యం కల్పించాలన్న డిమాండు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఇదివరకు పలు ప్రయత్నాలు జరిగాయి. 2010లో చివరిసారి అలాంటి ప్రయత్నం జరిగింది. అప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ ఆమోదించినా లోక్సభ ఆమోదించలేదు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే విధానాల రూపకల్పనలో ప్రజాప్రతినిధులుగా మహిళలకు అధిక భాగస్వామ్యం కల్పించడానికి దాదాపు మూడోవంతు సీట్లను వారికి కేటాయించడానికి ఇప్పుడు తాజాగా రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలన్న నిర్ణయం జరిగింది’ అని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులో పేర్కొంది.
2010 బిల్లులో లేని నిబంధన కొత్తగా..
కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఉభయ సభల ఆమోదం పొంది చట్టరూపం సంతరించుకున్నా మహిళలకు వెంటనే ఆ ఫలాలు అందే అవకాశం లేదు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టిచూస్తే ఇవి 2029 సార్వత్రిక ఎన్నికల్లోనో, ఆ తర్వాతో అమల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం బిల్లులో పెట్టిన నిబంధనలే. ఈ బిల్లు ద్వారా రాజ్యాంగంలో కొత్తగా 334ఏ క్లాజ్ చేరుస్తున్నారు. దాని ప్రకారం ఈ బిల్లు చట్టరూపం సంతరించుకున్న తర్వాత చేపట్టే మొదటి జనాభా లెక్కల సేకరణ తర్వాత నియోజకవర్గాలను పునర్విభజించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుచేసి కసరత్తు చేయాలి. 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లులో ఈ నిబంధన లేదు. ఇప్పుడు కొత్తగా డీలిమిటేషన్ నిబంధన పెట్టడంవల్ల ఆ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ లోక్సభ, అసెంబ్లీల్లో ఇప్పుడున్న సీట్లు యథావిధిగా కొనసాగుతాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణ మొదలుపెట్టి, దాన్ని పూర్తి చేసి నోటిఫై చేయడానికి కనీసం రెండేళ్లు పట్టే అవకాశం ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ సీట్లను పెంచి దాంతోపాటే ఈ మహిళా రిజర్వేషన్లను అమలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే బిల్లులో డీలిమిటేషన్ క్లాజ్ పెట్టి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. తాజాగా ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో 128వ రాజ్యాంగ సవరణ బిల్లు-2023 చట్ట రూపం సంతరించుకున్న తర్వాత మొదలుపెట్టే తొలి జనగణన అనంతరం నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
అటల్ సేతు గురించి సినీనటి రష్మిక (Rashmika Mandanna) మాట్లాడిన వీడియోపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
Swati Maliwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టాడని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. కడుపుపై కొట్టి, కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి