Panipuri: కుమార్తె పుట్టినరోజున.. లక్ష పానీపూరీలు పంచిన వ్యాపారి

మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని కోలార్‌కు చెందిన పానీపూరీ వ్యాపారి ఆంచల్‌ గుప్త తన కుమార్తె మొదటి పుట్టిన రోజు సందర్భంగా 1.01 లక్షల పానీపూరీలను ఉచితంగా పంపిణీ చేశాడు. ఆడపిల్లలను చదువులో ప్రోత్సహించేందుకే ఖర్చుకు వెనకాడలేదని

Updated : 19 Aug 2022 09:39 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని కోలార్‌కు చెందిన పానీపూరీ వ్యాపారి ఆంచల్‌ గుప్త తన కుమార్తె మొదటి పుట్టిన రోజు సందర్భంగా 1.01 లక్షల పానీపూరీలను ఉచితంగా పంపిణీ చేశాడు. ఆడపిల్లలను చదువులో ప్రోత్సహించేందుకే ఖర్చుకు వెనకాడలేదని తెలిపాడు. ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకే ఇలా చేశానని ఆంచల్‌ చెబుతున్నాడు. ఆయనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రశంసలు కురిపించారు. పానీపూరీ పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రామేశ్వర్‌ శర్మ హాజరయ్యారు.                

    -ఈటీవీ భారత్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని