సరే.. రేపు భేటీ పెట్టుకోండి
పంజాబ్ శాసనసభ ప్రత్యేక సమావేశంపై నెలకొన్న ప్రతిష్టంభన వీడింది. ఈ భేటీని ఈ నెల 27న నిర్వహించుకోవడానికి ఆ రాష్ట్ర గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ ఆదివారం అనుమతి మంజూరు
ఎట్టకేలకు పంజాబ్ అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ పచ్చజెండా
చండీగఢ్: పంజాబ్ శాసనసభ ప్రత్యేక సమావేశంపై నెలకొన్న ప్రతిష్టంభన వీడింది. ఈ భేటీని ఈ నెల 27న నిర్వహించుకోవడానికి ఆ రాష్ట్ర గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ ఆదివారం అనుమతి మంజూరు చేశారు. దీంతో రాజ్భవన్కు ఆప్ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన కలహం తాత్కాలికంగా సద్దుమణిగింది. ప్రత్యేక సమావేశంలో చేపట్టాల్సిన అంశాల జాబితాను గవర్నర్కు అందజేసిన ఒకరోజు అనంతరం ఆయన అసెంబ్లీ భేటీకి అనుమతివ్వడం గమనార్హం. నిజానికి ఈ నెల 22న విశ్వాసపరీక్షను ఎదుర్కోవడానికి ఆప్ ప్రభుత్వం ఒకరోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని భావించింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి భాజపా ప్రయత్నిస్తోందంటూ ఈ విశ్వాసపరీక్ష భేటీని ఆప్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!