Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఐటీ కంపెనీలు (IT Company) తమ ఉద్యోగులను తొలగిస్తుంటే.. గుజరాత్కు చెందిన ఓ ఐటీ సంస్థ మాత్రం ఉద్యోగుల్లో కొంత మందికి ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చింది. తమ సంస్థ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కంపెనీకి వచ్చిన లాభాలను ఇలా ఉద్యోగులతో పంచుకున్నట్లు తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు (IT Company) ఉద్యోగాల్లో కోతపెడుతున్నాయి. గూగుల్ (Google), మెటా (Meta) వంటి దిగ్గజ సంస్థలతోపాటు పలు అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఇలా రోజుకో కంపెనీ లేఆఫ్లను (Layoff) ప్రకటిస్తుండటంతో.. సాఫ్ట్వేర్ నిపుణులు, ఆశావహుల్లో ఆందోళన మొదలయ్యింది. ఇటువంటి తరుణంలో భారత్కు చెందిన ఓ ఐటీ కంపెనీ (Tridhya Tech) మాత్రం.. తమ ఉద్యోగుల్లో కొంతమందికి ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచింది.
అహ్మదాబాద్కు చెందిన త్రిథ్యా టెక్ సంస్థ.. ఇటీవలే ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ 13 మంది ఉద్యోగులకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల కృషి వల్లే కంపెనీ ఈ స్థాయికి చేరుకుందని పేర్కొన్న సంస్థ ఎండీ.. అందుకు గుర్తింపుగా వీటిని అందజేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చిన లాభాలను ఉద్యోగులతో పంచుకోవడమే మంచిదని భావించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లోనూ తమ ఉద్యోగులకు ఇటువంటి ఆఫర్లు ఉంటాయన్నారు. పూర్తిగా భాగస్వామ్యం కావడంతోపాటు కష్టపడి పనిచేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని చెప్పారు.
గతేడాది కూడా చెన్నైకి చెందిన ఓ ఐటీ కంపెనీ తమ ఉద్యోగులకు ఇటువంటి ఆఫర్ ఇచ్చింది. ఐడియాస్2ఐటీ (Ideas2IT) అనే సంస్థ 100 మంది ఉద్యోగులకు మారుతీ కార్లను అందించింది. తమ సంస్థలో 500 మంది ఉద్యోగులు ఉన్నారని.. అందులో 10 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వారి సేవలకు గుర్తింపుగా ఈ బహుమతులు అందిస్తున్నట్లు అప్పట్లో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం