US: భారత సంతతి సీఈఓ దారుణ హత్య.. 80 కి.మీ. వెంబడించి మరీ..!
అమెరికాలో భారత సంతతికి చెందిన ఫార్మా సంస్థ సీఈఓ దారుణ హత్యకు గురయ్యారు. ఓ దుండగుడు డబ్బుకోసం దాదాపు 80 కిలోమీటర్లు వెంబడించి మరీ......
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన ఫార్మా సంస్థ సీఈఓ దారుణ హత్యకు గురయ్యారు. ఓ దుండగుడు డబ్బుకోసం దాదాపు 80 కిలోమీటర్లు వెంబడించి మరీ.. వ్యాపారవేత్తను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. న్యూజెర్సీలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
న్యూజెర్సీలోని ప్లెయిన్స్బోరో ప్రాంతానికి చెందిన శ్రీరంగ అరవపల్లి(54) ఔరెక్స్ లేబొరేటరీస్ పేరుతో 2014 నుంచి ఫార్మా సంస్థను నడుపుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఓ క్లబ్లో క్యాసినో ఆట ముగించుకుని శ్రీరంగ దాదాపు 10 వేల డాలర్లతో ఇంటికి బయల్దేరారు. అయితే ఆ డబ్బును దొంగిలించాలని పన్నాగం పన్నిన ఓ దుండగుడు శ్రీరంగను పెన్సిల్వేనియాలోని ఆ క్యాసినో నుంచి వెంబడించాడు. దాదాపు 80 కిలోమీటర్ల దూరం సీఈఓను ఫాలో అయినట్లు పోలీసులు తెలిపారు. న్యూజెర్సీలోని ఇంట్లోకి ప్రవేశిస్తున్న సమయంలో దుండగుడు ఆయనపై కాల్పులు జరపడంతో మృతిచెందినట్లు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జెకాయ్ రీడ్ జాన్(27) అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. అతడిని అరెస్టు చేసి విచారణ జపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.