Lefthanders Day: ఎడమ చేతివాటం వారిలో ఉండే ప్రత్యేకతలివే..!
ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు ఎడమ చేతి వాటం ఉన్నవారని అంచనా. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎడమ చేతి ఉపయోగించడాన్ని దురాచారంగా భావిస్తుంటారు. అయితే, దీంతో కొన్ని చోట్ల వీరు ఇబ్బందులు...
నేడు అంతర్జాతీయ ఎడమచేతి వాటం వ్యక్తుల దినోత్సవం
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు ఎడమ చేతి వాటం ఉన్నవారని అంచనా. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎడమ చేతి ఉపయోగించడాన్ని దురాచారంగా భావిస్తుంటారు. అయితే, దీంతో కొన్ని చోట్ల వీరు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఎడమ చేతి వాటం ఉన్న వారి ఇబ్బందులపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడం, వారి ప్రత్యేకతలను చాటి చెప్పడమే లక్ష్యంగా ఏటా ఆగస్టు 13న ‘అంతర్జాతీయ ఎడమచేతి వాటం వ్యక్తుల దినోత్సవం’గా జరుపుకొంటున్నారు. ఈ సంప్రదాయం 1992, ఆగస్టు 13 నుంచి ప్రారంభమైంది. వాస్తవానికి డీన్ ఆర్ క్యాంప్బెల్ అనే వ్యక్తి 1976లో లెఫ్ట్హ్యాండర్స్ ఇంటర్నేషనల్ కంపెనీని స్థాపించారు. అనంతరం అంతర్జాతీయ ‘లెఫ్ట్హ్యాండర్స్ క్లబ్’ ఒకటి ఏర్పాటై ఆగస్టు 13ను ‘లెఫ్ట్హ్యాండర్స్ డే’గా జరపుకోవాలని 1992లో నిర్ణయించారు.
ఎందరో ప్రముఖులు..
ఎడమచేతి వాటం వారిలో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, సామాజిక, క్రీడా రంగాల్లో ఎందరో ప్రముఖులు ఉన్నారు. మహాత్మాగాంధీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్, చార్లెస్ డార్విన్, న్యూటన్, బెంజమిన్ ప్రాంక్లిన్, బిల్క్లింటన్, జార్జి బుష్, ఒబామా, సింగర్ లేడీ గాగా, జస్టిన్ బీబర్, రతన్టాటా, సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, సౌరవ్గంగూలీ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, శిఖర్ ధావన్, కుంబ్లే, జహీర్ ఖాన్, అమితాబచ్చన్, అభిషేక్ బచ్చన్, మహానటి సావిత్రి, సూర్యకాంతం, మమ్ముట్టి, ఇలా ఎడమ చేతివాటం వ్యక్తుల జాబితాలో చాలా మంది ప్రముఖులే ఉన్నారు.
ఎడమ చేతివాటం వారిపై జరిపిన పలు అధ్యయనాల్లో తేలిన ఆసక్తికరమైన విషయాలు..
* స్వతంత్ర భావాలు ఎక్కువ. జ్ఞాపక శక్తి మెండు.
* ఒకేసారి ఎక్కువ పనులు చేయగల సామర్థ్యం ఉంటుంది.
* చిత్రకారులు, సంగీతకారులు, ఆర్కిటెక్ట్ల్లో ఎక్కువగా ఎడమ చేతివాటం వారే ఉంటారు.
* బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కుడిచేతి వాటం వారి కంటే త్వరగా కోలుకుంటారు.
* బేస్బాల్, బాక్సింగ్, ఫెన్సింగ్, టెన్నిస్ వంటి క్రీడల్లో కుడి చేతివాటం వారితో పోలిస్తే ఎడమ చేతివాటం వారికి కాస్త ప్రయోజనం ఎక్కువ.
* టైపింగ్లోనూ వీరికి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. క్వర్టీ కీబోర్డులో ఒక్క ఎడమ చేతితో వీరు 3000 పదాలను టైప్ చేయగలరు. అదే కేవలం కుడి చేయి మాత్రమే వినియోగించి 300 పదాలు మాత్రమే టైప్ చేయగలం.
* కొంతమంది ఎడమ చేతివాటం వారన్నా.. ఎడమ దిశ అన్నా.. భయపడుతుంటారు. దాన్ని సినిస్ట్రోఫోబియా అంటారు.
* ప్రపంచ జనాభాలో 10-12 శాతం మంది ఎడమ చేతివాటం వారే.
* మెదడులోని ఎడమ, కుడి భాగాల్లో మెరుగైన అనుసంధానం ఉంటుంది.
* కుడి చేతి అలవాటున్న వారి కన్నా ఎడం చేతి అలవాటున్న వారికి షిజోఫెర్నియా అనే వ్యాధి వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని, పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయని పరిశోధకులు వివరించారు.
* కుడి చేతివాటం వారితో పోలిస్తే.. ఎడమ చేతివాటం వారికి నీటి లోపల చూసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
నోటా విజేతగా నిలిస్తే?
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?