అంతరిక్షంలో బౌద్ధాలయం..!

ఇప్పటి వరకు భూమిపై ఉన్న బౌద్ధాలయాల్లో కనిపించే బుద్ధుడు మరికొన్నేళ్లలో అంతరిక్షంలోనూ దర్శనం ఇవ్వనున్నాడు. జపాన్‌లోని క్యోటోలో ఉన్న డయ్‌గోజి దేవాలయంలోని సన్యాసులు అంతరిక్షంలో బౌద్ధ దేవాలయం ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఓ శాటిలైట్‌ డెవలప్‌మెంట్‌

Published : 21 Mar 2021 01:57 IST

టోక్యో: ఇప్పటి వరకు భూమిపై ఉన్న బౌద్ధాలయాల్లో కనిపించే బుద్ధుడు మరికొన్నేళ్లలో అంతరిక్షంలోనూ దర్శనం ఇవ్వనున్నాడు. జపాన్‌లోని క్యోటోలో ఉన్న డయ్‌గోజి దేవాలయంలోని సన్యాసులు అంతరిక్షంలో బౌద్ధ దేవాలయం ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఓ శాటిలైట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీతో కలిసి చేతులు కలిపారు.

టెర్రా స్పేస్‌‌ అనే కంపెనీ శాటిలైట్లను తయారు చేస్తుంటుంది. ఈ కంపెనీ ఓ శాటిలైట్‌లో జొటెనిన్‌ గౌంజీ పేరుతో ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఒక చిన్నపాటి డబ్బా రూపంలో ఉండే దేవాలయంలో మండల పెయింటింగ్స్‌ వేసి అందులో చిన్న బుద్ధుడి విగ్రహం పెట్టనున్నారు. దీన్ని శాటిలైట్‌లో పెట్టి అంతరిక్షంలోకి పంపుతారట. 2023లో ఈ దేవాలయం అందుబాటులోకి రానుందని డయ్‌గోజీ దేవాలయానికి చెందిన సన్యాసులు, టెర్రా స్పేస్‌ సంస్థ సంయుక్తంగా ప్రకటన చేశాయి. ఈ ఆలయం నిర్వహణను డయ్‌గోజీ ఆలయ పూజారులు చూసుకుంటారు.

భూమిపైనే భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా తమ ప్రార్థనలను నిర్వాహకులకు పంపిస్తే.. ఆ ప్రార్థనలు అంతరిక్షంలోని శాటిలైట్‌లో ఉన్న దేవాలయానికి పంపిస్తారట. అవి అక్కడ అమర్చిన మెమొరీ డివైజ్‌లో నిక్షిప్తవుతాయట. సాధారణంగా ఒక్క శాటిలైట్‌ తయారు చేసి అంతరిక్షంలోకి పంపడానికి 200 మిలియన్‌ యెన్లు అవసరమవుతాయట. దీంతో ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేవారి కోసం బౌద్ధ సన్యాసులు, టెర్రా స్పేస్‌ ప్రతినిధులు ఆన్వేషిస్తున్నారు. ఆర్థిక వనరులు సమకూరితే అనుకున్న సమయానికి అంతరిక్షంలో దేవాలయం ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి..

రియాల్టీ షో విజేతను అంతరిక్షంలోకి పంపుతారట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని