Eknath Shinde: ఆర్మీలో అవకాశాన్ని చేజార్చుకున్నా.. అయితేనేం శివ‘సైనికుడి’నయ్యా!
ఇండియన్ ఆర్మీకి ఎంపికైనప్పటికీ.. శిక్షణకు హాజరయ్యే అవకాశాన్ని చేజార్చుకున్నానని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అయితేనేం, శివ‘సైనికుడి’గా మారానని తెలిపారు.
ముంబయి: ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray)పై తిరుగుబాటు, తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి భాజపా (BJP)తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వంటి మహారాష్ట్ర (Maharashtra) రాజకీయ పరిణామాల్లో ఏక్నాథ్ శిందే (Eknath Shinde) కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ శిందే.. తన జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాలను తాజాగా ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ రోజు తన ప్రయాణ ప్రణాళికను మధ్యలోనే మార్చుకోకుంటే ఇప్పుడు భారత సైన్యం (Indian Army)లో ఉండేవాడినని అన్నారు. అయితే, తన నిర్ణయం పట్ల చింతించడం లేదని తెలిపారు.
‘నేను ఇండియన్ ఆర్మీకి ఎంపికయ్యా. లఖ్నవూలో శిక్షణ కోసం బయల్దేరా. అయితే, హరియాణాలోని రోహ్తక్లో స్నేహితుడి వివాహం ఉందన్న విషయం మార్గమధ్యలో గుర్తొచ్చింది. దీంతో రూట్ మార్చుకుని దిల్లీ నుంచి రోహ్తక్ చేరుకున్నా. మూడు నాలుగు రోజుల తర్వాత లఖ్నవూ వెళ్లా. అయితే, ప్రస్తుతానికి అవకాశం చేజారిందని, శిక్షణ కోసం కొత్త వారంట్తో తిరిగి రావాలని అక్కడి అధికారులు సూచించారు. దీంతో ముంబయికి తిరిగి వచ్చా. ఆ సమయంలో ఇక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. తదనంతరం ఆ విషయాన్ని అలాగే వదిలేసి రాజకీయాల్లో సక్సెస్ అయ్యా’ అని శిందే తన జ్ఞాపకాలను పంచుకున్నారు. తాను ఆర్మీలో చేరలేదని, అయితేనేం శివ‘సైనికుడి’గా మారానని పేర్కొన్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి పెళ్లికి హాజరైనందుకు రోహ్తక్లో ఓ అతిథి తనను అభినందించారని సీఎం శిందే గుర్తు చేసుకున్నారు. ‘ఇప్పటికీ నా మాటను నిలబెట్టుకుంటా. నా జీవన విధానంలో అది కనిపిస్తుంది’ అని తెలిపారు. సామాజిక సేవ, రాజకీయాల్లో బిజీ షెడ్యూల్ కారణంగా తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయానని శిందే తెలిపారు. తన భార్యే కుటుంబ బాగోగులు చూసుకునేదని, కుమారుడు శ్రీకాంత్ శిందే వైద్యుడిగా, రాజకీయవేత్తగా ఎదగడం వెనుక ఆమె ప్రోత్సాహం ఉందని చెప్పారు. శ్రీకాంత్ శిందే ప్రస్తుతం కల్యాణ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలపై అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం