‘నీతీశ్ ఆహారంలో ఏదో కలుపుతున్నారు.. అందుకే అలాంటి మాటలు’: మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ(Jitan Ram Manjhi).. ప్రస్తుత ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్(Nitish Kumar)ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నీతీశ్ తినే ఆహారంపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్(Nitish Kumar)ను పదవి నుంచి దింపేందుకు కుట్ర జరుగుతోందట. ఆయన ఆహారంలో విషపూరిత పదార్థాలు కలుపుతున్నారట. హిందుస్థాన్ అవామ్ మోర్చా(HAM-S) చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ(Jitan Ram Manjhi) ఈ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ వెలుపల పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘కొద్దిరోజుల క్రితం నీతీశ్ కుమార్(Nitish Kumar) అసెంబ్లీలో అసభ్య పదజాలం ఉపయోగించారు. ఆ మాటల వల్ల ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నిన్న కూడా ఆయన నియంత్రణ కోల్పోయి నా గురించి అవమానకరంగా మాట్లాడారు. నేను ఆయన కంటే అనుభవంపరంగా, వయసులోనూ పెద్దవాడిని అనే విషయాన్ని మర్చిపోయారు. ఆయన మానసిక ఆరోగ్యం దిగజారిపోతుందనేదానికి ఇది గుర్తు. ఆయనకు ఇచ్చే ఆహారంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆ ఆహారం వల్ల ఆయన తనపై తాను నియంత్రణ కోల్పోతున్నారని నాకు అనుమానం కలుగుతోంది. ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన్ను గద్దె దించేందుకు కుట్ర చేస్తున్నారు’ అని మాంఝీ(Jitan Ram Manjhi) వ్యాఖ్యలు చేశారు.
చెత్తకుప్పలో లభ్యమైన ఆ రూ.25 కోట్లు నకిలీవేనట!
ఇటీవల బిహార్లో నిర్వహించిన కులగణన నివేదికను నీతీశ్(Nitish Kumar) సర్కారు గత మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికపై అసెంబ్లీలో మాంఝీ అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో మాంఝీని ఉద్దేశించి నీతీశ్ విరుచుకుపడ్డారు. ‘నేను ముఖ్యమంత్రి అయ్యాను అని ఆయన పదేపదే చెప్తున్నారు. నా పిచ్చితనం వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోపక్క.. నివేదికను ప్రవేశపెట్టిన రోజు నీతీశ్ ‘జనాభా నియంత్రణ’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాంఝీ నుంచి ఈ సంచలన ఆరోపణలు రావడం గమనార్హం.
మాంఝీ 2014లో బిహార్(Bihar) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు ఆయన జేడీయూలో కీలక నేత. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జేడీయూ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పుడు ముఖ్యమంత్రిగా నీతీశ్ దిగిపోవడంతో.. మాంఝీకి ఆ అవకాశం వచ్చింది. తర్వాత జేడీయూ నుంచి బయటకు వెళ్లిపోయిన ఆయన హెచ్ఏఎం-ఎస్ పార్టీ స్థాపించారు. ప్రస్తుతం ఈ పార్టీ భాజపా భాగస్వామి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
మహిళలపై లైంగిక వేధింపులు, అపహరణల అంశానికి సంబంధించి హెచ్డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్పై కేసులు నమోదయ్యాయి. -
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
లోక్సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే