కూటమి పేరులో ‘ఇండియా’ ఉంటే సరిపోదు: విపక్షాలపై మోదీ తీవ్ర విమర్శలు
భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో విపక్ష పార్టీలపై ప్రధాని మోదీ(Modi) తీవ్ర విమర్శలు చేశారు. వాటి తీరుపై మండిపడ్డారు.
దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ(Modi) విపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష ఎంపీలు తమ నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దిశాదశ లేకుండా వారు ముందుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
మంగళవారం నిర్వహించిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘ఇలా ఒక లక్ష్యం లేకుండా ముందుకెళ్లే విపక్షాలను నేను ఇంతవరకు చూడలేదు. అవి అధికారంలోకి రావాలనుకోవడం లేదు. ఎప్పటికీ విపక్షంలోనే ఉండాలని అవి నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. పేరులో ఇండియా(I.N.D.I.A) ఉంటే సరిపోదు. వారు దేశ ప్రజలను తప్పుదోవపట్టించేందుకు ఆ పదాన్ని ఉపయోగించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్.. వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉంది’ అంటూ వాటిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నాయి.
మయన్మార్ నుంచి మణిపుర్కు.. రెండు రోజుల్లో 700 మంది
ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ కార్యకలాపాలు(Monsoon Session of Parliament) ఒక్కరోజు కూడా సజావుగా సాగలేదు. మణిపుర్(Manipur)లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం, ఇటీవల అక్కడ వెలుగులోకి వచ్చిన వీడియో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని పార్లమెంట్(Parliament)లో ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. దాంతో ఉభయసభల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అలసిపోయి, నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ కూటమికి సింగిల్ పాయింట్ అజెండా.. మోదీని వ్యతిరేకించడమేనని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయంపై ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మణిపుర్పై మాట్లాడమంటే.. ఈస్ట్ ఇండియా అంటున్నారు : విపక్షాల ధ్వజం
మోదీ వ్యాఖ్యలపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) స్పందించారు. ‘రూల్ 267 కింద చర్చ జరపాలని పలువురు సభ్యులు నోటీసులు ఇచ్చారు. మేము మణిపుర్ అంశంపై మాట్లాడుతుంటే.. ప్రధాని మాత్రం ఈస్ట్ ఇండియా అంటున్నారు’ అంటూ మోదీ వ్యాఖ్యలకు ఖర్గే బదులిచ్చారు. మరోపక్క రాజ్యసభ సభాపక్ష నేత పీయూష్ గోయల్(Piyush Goyal ) మాట్లాడుతూ.. ‘హోం మంత్రి అమిత్ షా మణిపుర్ అంశంపై మాట్లాడతారు. అలాగే మేం రాజస్థాన్, చత్తీస్గఢ్, పశ్చిమ్ బెంగాల్, మణిపుర్లో మహిళలపై జరుగుతోన్న అకృత్యాలపై కూడా చర్చించాలని భావిస్తున్నాం’ అని గోయల్ అన్నారు. మణిపుర్ అంశంపై చర్చకు సిద్ధమేనని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. విపక్ష ఎంపీలు నిరసన కొనసాగించడంతో రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
అటల్ సేతు గురించి సినీనటి రష్మిక (Rashmika Mandanna) మాట్లాడిన వీడియోపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
Swati Maliwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టాడని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. కడుపుపై కొట్టి, కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!