Operation Ironside: 18 దేశాల్లో 800 నేరగాళ్ల ఆరెస్ట్!
అండర్వరల్డ్లో ఉంటూ ఎన్నోఏళ్లుగా మాదకద్రవ్యాల నుంచి హత్యోదంతాలకు పాల్పడుతోన్న అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల (Organised Crime) గుట్టు రట్టయ్యింది.
వ్యవస్థీకృత నేరగాళ్లపై అంతర్జాతీయ ఆపరేషన్
వాషింగ్టన్: అండర్వరల్డ్లో ఉంటూ ఎన్నోఏళ్లుగా మాదకద్రవ్యాల నుంచి హత్యోలకు పాల్పడుతోన్న అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల (Organised Crime) గుట్టు రట్టయ్యింది. ఆస్ట్రేలియా పోలీసులు, అమెరికా ఎఫ్బీఐ సంయుక్తంగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో వందల సంఖ్యలో నేరగాళ్లు చిక్కిపోయారు. ఈ ఆపరేషన్లో 18 దేశాల్లో దాదాపు 800 మంది నేరగాళ్లను అరెస్టు చేసినట్లు సమాచారం. వీరి నుంచి వందల సంఖ్యలో మారణాయుధాలు, టన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలు, కొన్ని కోట్ల డాలర్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతోన్న అంతర్జాతీయ గ్యాంగ్లకు ఇది చెంపపెట్టు అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ పేర్కొన్నారు.
ఆపరేషన్ ఐరన్సైడ్..
నిఘా వ్యవస్థలకు చిక్కకుండా అండర్వరల్డ్ (Underworld)లో ఉంటూ ఎన్నో నేరాలకు పాల్పడే అంతర్జాతీయ నేరగాళ్లు గత కొన్నేళ్లుగా తమ పంథాను మార్చారు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించే ఇలాంటి నేరగాళ్లు.. డిజిటల్ సాధనాలను సురక్షితంగా భావిస్తూ సురక్షిత సమాచార వ్యవస్థ ద్వారా తమ నేర సామ్రాజ్యాన్ని విస్తురిస్తున్నారు. ముఖ్యంగా నిఘా వర్గాల చేతికి చిక్కకుండా మాదక ద్రవ్యాల రవాణా, హత్యలు, అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా నిలుస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఆస్ట్రేలియా పోలీసులు, అమెరికా ఎఫ్బీఐ సహకారంతో 2018లో స్టింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అమెరికాలో ఎఫ్బీఐ దీనిని ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ (Operation Trojan Shield) పేర్కొనగా.. ఆస్ట్రేలియా పోలీసులు దీనికి ఆపరేషన్ ఐరన్సైడ్ (Operation Ironside)గా వ్యవహరించారు. అనంతరం ఈ ఆపరేషన్లో యూరోపియన్ పోలీసులు (యూరోపోల్)లతో పాలు మరిన్ని దేశాలు కూడా జతకలిశాయి.
ఎలా చిక్కారంటే..
అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు కలిగిన డిజిటల్ సాధనాలను అంతర్జాతీయ నేరగాళ్లు విరివిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా EncroChat, Sky ECC వంటి ప్లాట్ఫామ్లను వాడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇదే అదునుగా భావించిన ఫెడరల్ పోలీసులు ఓ ప్రత్యేకమైన ఫోన్ను రూపొందించాయి. కెమెరా, మాట్లాడే సౌకర్యం లేని ANOM (An0m) యాప్ ఉన్న ప్రత్యేక ఫోన్లను మధ్యవర్తుల ద్వారా అండర్వరల్డ్ నేరగాళ్లకు చేరేట్లు ప్రయత్నించారు. అలా అక్కడినుంచి వివిధ దేశాల్లో ఉన్న వారి భాగస్వామ్య గ్యాంగ్లకు ఈ ఫోన్లు చేరిపోయాయి. వీటిలో కేవలం మెసేజ్ రూపంలో సమాచారాన్ని పంచుకునే వీలు ఉండడంతో నేరగాళ్లు వాటిని సురక్షితంగా భావించారు. ఇలా 18నెలల కాలంలో 100దేశాల్లో దాదాపు 300 క్రిమినల్ గ్యాంగ్లకు ఈ సాంకేతికతను వినియోగించడం మొదలుపెట్టారు. అదే సయమంలో అమెరికా, ఆస్ట్రేలియాతోపాటు ఆయా దేశాల నిఘా వర్గాలు ఆ యాప్లోని లక్షల సంఖ్యలో మెసేజ్లను విశ్లేషిస్తూ వచ్చాయి. వీటిలో నేరగాళ్లు మాదక ద్రవ్యాలు, హింస, అమాయకుల హత్యలకు సంబంధించిన వ్యూహాలనే ఎక్కువగా చర్చించినట్లు అధికారులు గుర్తించారు. ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఓ కేఫ్ వద్ద మెషిన్ గన్తో దాడి చేయాలకున్న ప్రయత్నాన్ని పోలీసులు నిలువరించగలిగారు. ఆపరేషన్ తుది దశలో భాగంగా అరెస్టుల పర్వం మొదలు కావడంతో అంతర్జాతీయ నేరగాళ్ల సామ్రాజ్యం గుట్టురట్టయ్యింది.
18 దేశాల్లో 800 మంది అరెస్ట్
పోలీసులు హ్యాక్ చేసిన విషయాన్ని పసిగట్టని నేరగాళ్లు వారి సమాచార మార్పిడిని అలాగే కొనసాగించారు. చివరకు ఒక రోజులో భారీ సెర్చ్ వారెంట్లను జారీ చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. దాదాపు 224 మందిని అరెస్టు చేసింది. వారినుంచి 104 ఆయుధాలు,కోట్ల డాలర్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో దాదాపు 800 మంది నేరగాళ్లను అరెస్టు చేసినట్లు ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ కమిషనర్ రీసె కెర్షా పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ మాదకద్రవ్యాల రవాణాలో ఆస్ట్రేలియాతో పాటు ఆసియా, దక్షిణ అమెరికా, మిడిల్ ఈస్డ్ దేశాలకు చెందిన నేరగాళ్ల పాత్రే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఇలాంటి వారిని న్యూజిల్యాండ్లో 35మందిని అరెస్ట్ చేసినట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. అమెరికా, యూరప్ దేశాల సమాచారాన్ని ఆయా ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి.
‘వివిధ దేశాల నిఘా సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ ఆపరేషన్ వ్యవస్థీకృత నేరగాళ్లకు భారీ ఎదురు దెబ్బ. కేవలం ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోన్న ఈ వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న వారికి చెంపపెట్టు’ అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు