PM Modi: ప్రపంచం కోసం భారత్ పనిచేస్తోంది: ప్రధాని మోదీ
సిక్కుమత గురువు తేజ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి మాట్లాడారు.
దిల్లీ: భారత్ ఎప్పుడూ ఏ దేశానికైనా, సమాజానికైనా హాని తలపెట్టదని, ప్రపంచ సంక్షేమం కోసం ఆలోచిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సిక్కుమత గురువు తేజ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి మాట్లాడారు. సూర్యాస్తమయం తర్వాత ఎర్రకోట నుంచి ప్రసంగించిన మొదటి ప్రధాని మోదీ కావడం విశేషం.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘భారత స్వాతంత్ర్య స్వప్నం ఎర్రకోట నుంచి ప్రతిధ్వనించింది. మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్య ఫలాలు మనం అనుభవిస్తున్నాం. సిక్కుగురువుల ఆదర్శాలను భారత్ అనుసరిస్తోంది. మన గురువులు సామాజిక బాధ్యతలు నిర్వర్తించారు. సామాజిక బాధ్యత కోసం గురువులు తమ జీవితాలను సమర్పించారు. తమ శక్తిని సేవా మాధ్యమంగా మలుచుకున్నారు. దురాగతాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా దేశాన్ని గొప్పశక్తి నడిపించింది. గురుగోవింద్జీ యాత్ర స్థలాలను రైల్వే ద్వారా అనుసంధానిస్తాం. గురు తేజ్ బహదూర్ బలిదానానికి గుర్తుగా శిశు గంజ్ సాహిబ్ గురుద్వారా ఉంది. అప్పట్లో మతం పేరుతో హింస తారస్థాయికి చేరింది. ఔరంగజేబు నిరంకుశ ఆలోచనల ముందు గుర్ తేజ్ ధైర్యంగా నిలిచారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడానికి గురు తేజ్ త్యాగం తరాల వారికి స్ఫూర్తిగా నిలిచింది. మత ఛాందసవాద తుపానులు సంభవించినా భారతదేశం నిలబడగలిగింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం నేడు భారత్ వైపు చూస్తోంది. అఫ్గానిస్తాన్లో చిక్కుకున్న వానిరి స్వదేశానికి తరలించగలిగాం. అఫ్గాన్ నుంచి వచ్చిన వారికి కూడా పౌరసత్వం ఇచ్చాం. ఇవాళ మొత్తం ప్రపంచం కోసం భారత్ పనిచేస్తోంది. భారతదేశం సంప్రదాయ వైద్యాన్ని వ్యాప్తి చేస్తోంది. ప్రపంచ సంఘర్షణలో కూడా భారత్ శాంతినే కోరుకుంటోంది. దేశాభివృద్ధిలో అందిరి కృషి అవసరం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
1675లో అప్పటి పరిపాలకుడిగా ఉన్న ఔరంగజేబు తొమ్మిదవ సిక్కుమత గురువైన తేజ్ బహదూర్ను ఉరితీయాలని ఎర్రకోట నుంచే ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు ప్రధాని మోదీ ప్రసంగానికి ఈ కోటను ఎంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక తపాలా బిళ్ల, స్మారక నాణెం విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.