Delhi: దిల్లీలో బొగ్గు కొరత.. ఆసుపత్రులు, మెట్రోలకు కరెంట్ కట్ అవకాశం!
దేశ రాజధాని దిల్లీలో బొగ్గు కొరత సమస్య నానాటికీ తీవ్రంగా మారుతోంది. ఇదిలా కొనసాగితే విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందని, మెట్రోలు, ఆసుపత్రులకు కూడా కరెంట్ సరఫర్ నిలిచిపోతుందని
హెచ్చరించిన దిల్లీ ప్రభుత్వం
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో బొగ్గు కొరత సమస్య నానాటికీ తీవ్రంగా మారుతోంది. ఇదిలా కొనసాగితే విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందని.. మెట్రోలు, ఆసుపత్రులకు కూడా కరెంట్ సరఫరా నిలిచిపోతుందని దిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని హెచ్చరించింది. తక్షణమే రాజధానిలోని విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను పెంచాలని కోరింది. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
‘‘దిల్లీలోని రెండు ప్రధాన విద్యుత్ స్టేషన్లు అయిన దాద్రి-2, ఊంచహార్ ప్లాంట్లలో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. దిల్లీలో అవసరమయ్యే విద్యుత్ డిమాండ్లో 25-30 శాతం ఈ స్టేషన్ల నుంచే వస్తుంది. ఈ రెండు పవర్ ప్లాంట్ల వద్ద ఇప్పుడు చాలా తక్కువ మొత్తంలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. ఇదిలాగే కొనసాగితే, దిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెట్రో స్టేషన్ల వంటి అత్యవసర, కీలక సేవలకు 24 గంటల నిరంతర కరెంట్ను సరఫరా చేయడం కష్టంగా మారుతుంది’’ అని దిల్లీ సర్కారు ఓ ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు ఇప్పటికే పలు ప్రాంతాల్లో కరెంట్ కోతలు మొదలయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైనే ఉంటున్నాయి. దీంతో కరెంట్ వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే డిమాండ్కు తగినంత విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు బొగ్గు కొరత సమస్యగా మారిందని ప్రభుత్వం చెబుతోంది.
ఇదిలా ఉండగా.. దిల్లీకి బొగ్గు సరఫరాను పెంచేందుకు కేంద్రం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా కొన్ని ప్రయాణికుల రైళ్లను రద్దు చేసినట్లు భారత రైల్వే వెల్లడించింది. అయితే ఈ రైళ్ల రద్దు తాత్కాలికమేనని, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత వీటిని తిరిగి పునరుద్ధరిస్తామని ఇండియన్ రైల్వే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ కృష్ణ బన్సాల్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
నోటా విజేతగా నిలిస్తే?
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?