Ukraine Crisis: ఐరాసలో భారత్ ఆందోళన.. సుమీలోని విద్యార్థుల తరలింపునకు ముందుకొచ్చిన రష్యా
ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల్ని తరలించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
మానవతా కారిడార్ల ప్రకటన
దిల్లీ: ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల్ని తరలించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్, రష్యాకు భారత్ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. దీని గురించి ప్రధాని నరేంద్రమోదీ ఇరు దేశాల అధ్యక్షులతో స్వయంగా మాట్లాడారు కూడా. ఈ క్రమంలో ఇప్పుడు పౌరుల తరలింపునకు రష్యా ముందుకొచ్చింది. సుమీ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలు వెళ్లేందుకు మానవతా కారిడార్లను ఏర్పాటు చేయనుంది. అందుకోసం కాల్పులను తాత్కాలికంగా విరమించనుంది.
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30కి ఈ ఆపరేషన్ ప్రారంభం కానుంది. ఈ కారిడార్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను రష్యాలోని భారత రాయబార కార్యాలయం విడుదల చేసింది. ఆ జాబితాలో ఉక్రెయిన్ ఈశాన్య నగరమైన సుమీ కూడా ఉంది. అక్కడ సుమారు 600 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయి ఉన్నారు. ఎన్నిమార్లు ప్రయత్నించిన వారు ఆ ప్రాంతాన్ని వీడటం కుదరలేదు. ఈ విషయాన్ని లేవనెత్తి నిన్న జరిగిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో భారత్ ఆందోళన చెందింది. ఇరు దేశాలను ఎన్ని మార్లు కోరినా.. మానవతా కారిడార్ల ఏర్పాటు మాత్రం సాధ్యం కావడం లేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. అయితే దీనిపై ఉక్రెయిన్ వైపు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్లో రష్యా దాడి కొనసాగుతోంది. సుమీలోని నివాస సముదాయాలపై రష్యా విమానాలు బాంబుల వర్షం కురిపించినట్లు అక్కడి రీజినల్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ దిమిత్రో జివిట్స్కీ తెలిపారు. ఈ దాడుల్లో చిన్నారులతో సహా పలువురు మృతి చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.